గోపీచంద్కి హిట్ రావాలంటే ఆ కాంబో సెట్ అవ్వాల్సిందేనా.?
- March 27, 2024
రాధాక్రిష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘జిల్’ మూవీ మ్యాచో స్టార్ గోపీచంద్కి సూపర్ డూపర్ హిట్ ఇచ్చింది. ఆ తర్వాత గోపీచంద్కి ఆ స్థాయి హిట్ ఇచ్చిన సినిమా పడలేదనే చెప్పాలి.
రీసెంట్గా ‘భీమా’ సినిమాతో భారీ అంచనాలు నమోదు చేశాడు కానీ, రిలీజ్ తర్వాత తుస్మనిపించాడు. దాంతో, మరో ఫెయిల్యూర్ తన ఖాతాలో వేసేసుకున్నాడు గోపీచంద్.
అయినా ఏమాత్రం ఉత్సాహం తగ్గకుండా తర్వాతి ప్రాజెక్టుల మీద ఫోకస్ పెట్టాడు గోపీచంద్. ప్రస్తుతం ఆయన శీను వైట్ల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్గా నటిస్తోంది. ‘విశ్వం’ అనే టైటిల్ని ఈ సినిమాకి అనుకుంటున్నారు.
దీంతో పాటూ, త్వరలోనే తన హిట్ కాంబో రాధాకృష్ణతో ఓ సినిమా చేయబోతున్నాడు గోపీచంద్. యూవీ ప్రొడక్షన్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది. ఈ సినిమా పైనే గోపీచంద్ ఆశలు పెట్టుకున్నాడు. శీను వైట్ల ‘విశ్వం’ రిజల్ట్ ఎలా వున్నా.. రాధాకృష్ణ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని గోపీచంద్ అభిమానులు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. చూడాలి మరి.
తాజా వార్తలు
- పాత నోట్ల మార్పిడికి సెప్టెంబర్ 21 డెడ్లైన్.. ఒమన్ సెంట్రల్ బ్యాంక్ కీలక ప్రకటన
- అబుదాబి నేచురల్ హిస్టరీ మ్యూజియాన్ని సందర్శించిన షేక్ మహమ్మద్
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- దుబాయ్ AIM కాంగ్రెస్లో మధ్యప్రదేశ్ పెట్టుబడి అవకాశాల ప్రదర్శన
- రూ.3 లక్షలు తిరిగి ఇచ్చిన కండక్టర్.. హజ్ యాత్రికుడి డబ్బును భద్రంగా అప్పగింత
- వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు!
- మొదటిసారి ఢిల్లీ బయట జాతీయ అవార్డుల వేడుక..!
- ఇది శాసనసభ కాదు.. దుశ్శాసన సభ: KTR
- జాబ్స్ పేరుతో కోట్లలో మోసం.. 'నందూస్ వరల్డ్' నందన అరెస్ట్..
- సౌదీతో భారత్ సంబంధాల బలోపేతంలో భారత కార్మికుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్







