విదేశీ కంపెనీలలో పౌరుల నియమకం..ఒమన్ కీలక ఉత్తర్వులు
- March 28, 2024మస్కట్: విదేశీ పెట్టుబడిదారులు ఒమన్లో తమ వాణిజ్య కార్యకలాపాలలో కనీసం ఒక ఒమానీ పౌరుడిని నియమించాలని మంత్రుల మండలి ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం స్థానికంగా ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు దోహదం చేస్తుందన్నారు. ఈ నియంత్రణ, ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వస్తుందని ప్రకటించింది. సుల్తానేట్ ఆఫ్ ఒమన్లో మరింత సమగ్రమైన పెట్టుబడి వాతావరణాన్ని పెంపొందించడానికి విస్తృత ప్రయత్నాలలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖలోని ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్ సెంటర్ డైరెక్టర్ జనరల్ ఇంజనీర్ అమ్మర్ బిన్ సులైమాన్ అల్ ఖరౌసీ వెల్లడించారు. కొత్త నియంత్రణ ప్రకారం, విదేశీ పెట్టుబడిదారులు ఒమన్లో వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించిన ఒక సంవత్సరంలోపు ఒమన్ పౌరుడిని నియమించుకోవాలి.
తాజా వార్తలు
- ఓటింగ్ సరళి విపరీతంగా పెరిగే అవకాశం!
- తిరిగి విధుల్లో చేరిన ఎయిరిండియా ఎక్స్ప్రెస్ క్యాబిన్ సిబ్బంది!
- తెలంగాణలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన..
- లోక్సభ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: డీజీపీ రవిగుప్తా
- అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తు, ఫీజు, ప్రక్రియ
- దుబాయ్లో పెట్టుబడి ద్వారా ఉద్యోగి గోల్డెన్ వీసాకు మారవచ్చా?
- బహ్రెయిన్ చేరుకున్న అరబ్ లీగ్ చీఫ్
- మోసపూరిత ప్రకటనల పై సౌదీ హెచ్చరిక
- కువైట్ అమీర్ కు వ్యతిరేకంగా పోస్టులు..పలువురికి నోటీసులు
- 250 మంది ప్రవాసులకు ఒమానీ పౌరసత్వం