'ప్రతినిధి-2' టీజర్ లాంచ్ చేసిన చిరంజీవి
- March 30, 2024హైదరాబాద్: ప్రముఖ టీవీ జర్నలిస్టు మూర్తి దర్శకత్వంలో నారా రోహిత్ ప్రధానపాత్రలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ప్రతినిధి-2. తాజాగా ఈ చిత్రం టీజర్ ను మెగాస్టార్ చిరంజీవి నేడు లాంచ్ చేశారు. ప్రతినిధి-2 చిత్రబృందం నేడు చిరంజీవి నివాసానికి వెళ్లింది.
దర్శకుడు మూర్తి, హీరో నారా రోహిత్ ను చిరంజీవి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రతినిధి-2 చిత్ర విశేషాలను మూర్తి, నారా రోహిత్... చిరంజీవికి వివరించారు. అనంతరం ఆయన లాప్ టాప్ ద్వారా టీజర్ ను ఆవిష్కరించారు. ఈ చిత్రం విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నానని చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మూర్తి... చిరంజీవికి కృతజ్ఞతలు తెలియజేశారు.
టీజర్ చూస్తే పక్కా పొలిటికల్ చిత్రమని అర్థమవుతోంది. వానర ఎంటర్టయిన్ మెంట్స్, రాణా ఆర్ట్స్ బ్యానర్లపై తెరకెక్కుతున్న ప్రతినిధి-2 చిత్రానికి కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్ బొల్లినేని నిర్మాతలు. మహతి స్వరసాగర్ సంగీతం అందించారు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్