నారా రోహిత్ మళ్లీ వస్తున్నాడు.!
- March 30, 2024
కంటెంట్ వున్న కథలకు పెట్టింది పేరు హీరో నారా రోహిత్. చేసినవి తక్కువ సినిమాలే అయినా గుర్తుండిపోయే సినిమాలు చేశాడు. కొన్ని సినిమాల్లో గెస్ట్ రోల్స్ పోషించి తనదైన ప్రత్యేకతను చాటుకున్నాడు.
అయితే, ఈ మధ్య పెద్దగా నారా రోహిత్ సినిమాలు పాపులర్ కావడం లేదు. దాంతో కాస్త బ్రేక్ తీసుకున్నాడు. మళ్లీ ఇప్పుడే ఓ ప్రత్యేకమైన సినిమాతో రాబోతున్నాడు.
నారా రోహిత్ కెరీర్ తొలి నాళ్లలో చేసిన సినిమా ‘ప్రతినిధి’. ఈ సినిమా అప్పట్లో ఓ సంచలనం. అప్పటి రాజకీయ పరిస్థితుల్ని సూటిగా ఎత్తి చూపిన సినిమా ఇది. మీడియాని కూడా ఏకి పారేసింది.
అలాంటి కథనంతోనే ఆ సినిమాకి సీక్వెల్గా రాబోతోంది ‘ప్రతినిధి 2’. ఈ సినిమాతో రీపోర్టర్ మూర్తి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.చిత్రానికి కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్ బొల్లినేని నిర్మాతలు.
‘ఈ దేశం అప్పు ఎంత.?’ ఇలాంటి ప్రశ్నలు హీరో నోటి వెంట ఈ సినిమా ద్వారా పలికించబోతున్నాడట మూర్తి. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ సినిమా ఎలాంటి సంచలనాలు రేకెత్తిస్తుందో చూడాలి మరి.
తాజా వార్తలు
- పాత నోట్ల మార్పిడికి సెప్టెంబర్ 21 డెడ్లైన్.. ఒమన్ సెంట్రల్ బ్యాంక్ కీలక ప్రకటన
- అబుదాబి నేచురల్ హిస్టరీ మ్యూజియాన్ని సందర్శించిన షేక్ మహమ్మద్
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- దుబాయ్ AIM కాంగ్రెస్లో మధ్యప్రదేశ్ పెట్టుబడి అవకాశాల ప్రదర్శన
- రూ.3 లక్షలు తిరిగి ఇచ్చిన కండక్టర్.. హజ్ యాత్రికుడి డబ్బును భద్రంగా అప్పగింత
- వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు!
- మొదటిసారి ఢిల్లీ బయట జాతీయ అవార్డుల వేడుక..!
- ఇది శాసనసభ కాదు.. దుశ్శాసన సభ: KTR
- జాబ్స్ పేరుతో కోట్లలో మోసం.. 'నందూస్ వరల్డ్' నందన అరెస్ట్..
- సౌదీతో భారత్ సంబంధాల బలోపేతంలో భారత కార్మికుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్







