‘పుష్ప మాస్ జాతర’ మొదలైందిగా.!
- April 06, 2024
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ ప్రమోషన్లు మొదలెట్టేశాడనిపిస్తోంది. ఆగస్టు 15న వరల్డ్ వైడ్గా ఈ సినిమా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జాతీయ ఉత్తమ నటుడి అవార్డు గ్రహీత అయిన అల్లు అర్జున్ నుంచి వస్తున్న సినిమా కావడంతో, ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయ్.
ఎటువంటి అంచనాల్లేకుండా వచ్చిన ‘పుష్ప’ మొదటి పార్ట్ ఊహించని విధంగా సంచలనాలు నమోదు చేసింది. ఆ అంచనాలను దాటి వుండేలా ఈ రెండో పార్ట్ చిత్రీకరిస్తున్నారు సుక్కు అండ్ టీమ్.
ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక మరో రెండు రోజుల్లో అనగా ఏప్రిల్ 8న మరో సర్ప్రైజ్ రానుందని ఓ లేటెస్ట్ పోస్టర్ ద్వారా చిత్ర యూనిట్ కన్ఫామ్ చేసింది.
ఆ సర్ప్రైజ్ ఏంటీ.? ఎలా వుండబోతోంది.? అనే అంశంపై అల్లు అర్జున్ ఫ్యాన్స్లో క్యూరియాసిటీ మొదలైంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ అదిరిపోయే మ్యూజిక్ అందిస్తున్నారు. రష్మిక మండన్నా హీరోయిన్గా నటిస్తుండగా, మైత్రీ మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు