హైదరాబాద్‌లో ఐపీఎల్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న గ్యాంగ్ అరెస్ట్..

- April 08, 2024 , by Maagulf
హైదరాబాద్‌లో ఐపీఎల్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న గ్యాంగ్ అరెస్ట్..

హైదరాబాద్: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో భారీ మొత్తంలో క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న గ్యాంగ్ ను ఎస్‌వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజేంద్ర నగర్, ఎస్ఓటీ ఆర్సీపురం పోలీసు జాయింట్ ఆపరేషన్ నిర్వహించి ఈ గ్యాంగ్ ఆటకట్టించారు.

ఆన్‌లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. 18 లక్షల 50 వేల రూపాయల నగదుతో పాటు బ్యాంకు ఖాతాలోని 18 లక్షల 34 వేల రూపాయల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. మొత్తం కలిపి రూ.37,84,918 స్వాధీనం చేసుకున్నారు.

డిల్లీ కేంద్రంగా ఓ ఆన్ లైన్ యాప్ రూపొందించి క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తోంది ఈ గ్యాంగ్. ఆ యాప్‌తో హైదరాబాద్ కేంద్రంగా ఆన్ లైన్ బెట్టింగ్ నిర్వహిస్తోంది. గ్యాంగ్ సభ్యులు రామకృష్ణ గౌడ్, ఉపేందర్ గౌడ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై ఇంకా ఏమైనా కేసులు ఉన్నాయా? అన్న వివరాలపై విచారణ జరుపుతున్నారు. మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com