తమ్ముడికి మెగాస్టార్ భారీ విరాళం
- April 08, 2024
హైదరాబాద్: ఎన్నికల నిర్వహణ కోసం తమ్ముడు పవన్ కళ్యాణ్కు మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం చెక్కుల రూపంలో అందించారు. హైదరాబాద్ నగర శివారులో ముచ్చింతల్ దగ్గర జరుగుతున్న విశ్వంభర షూటింగ్ లొకేషన్ లో వున్న చిరంజీవిని ఇవాళ అన్న నాగబాబుతో కలసి వెళ్లి ఆశీస్సులు తీసుకున్నారు పవన్. విజయోస్తు అని చిరంజీవి ఆశీర్వదించారు. కాసేపు ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితుల గురించి ముగ్గురూ చర్చించుకున్నారు. అక్కడే వున్న ఆంజనేయ స్వామి విగ్రహంకు దండం పెట్టుకుని చిరంజీవికి పాదాభివందనం చేశారు పవన్ కళ్యాణ్. అక్కడే ఐదు కోట్ల విలువ కలిగిన చెక్స్ అందించారు. ఇది చిన్న మొత్తమే అని, అడగకపోయినా ప్రజల కోసం కష్టపడుతున్నందుకు తాను ఇస్తున్న కానుక అని ఆశీర్వదించారు. విజయంతో తిరిగి వచ్చి కలుస్తానని పవన్ కళ్యాణ్ భరోసాగా తెలిపారు. విజయీభవ అని చిరంజీవి అన్నారు.
తాజా వార్తలు
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇరాన్ డ్రోన్ దాడిలో దెబ్బతిన్న కువైట్ విద్యుత్ కేంద్రం..!!
- అల్ ఖబౌరాలో నీటమునిగి బాలుడు మృతి..!!
- 20 మిలియన్ దిర్హమ్ల గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయుడు..!!
- ఖతార్ లో పిల్లల భద్రతాకు మార్గదర్శకాలు జారీ..!!
- ఐఎమ్డి స్మార్ట్ సిటీ ఇండెక్స్లో 8 సౌదీ నగరాలు..!!
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు









