ఆటోమొబైల్స్.. ఫిబ్రవరిలో రికార్డు స్థాయిలో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు
- April 09, 2024
దోహా: ఫిబ్రవరి 2024లో దేశంలో మొత్తం రిజిస్టర్డ్ కొత్త వాహనాల సంఖ్య 7,231గా నమొదు అయిందని ప్లానింగ్ అండ్ స్టాటిస్టిక్స్ అథారిటీ (PSA) వెల్లడించింది. వార్షిక ప్రాతిపదికన ఇది 23.4 శాతం ఖతార్ కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లలో పెరుగుదల నమోదైంది. ప్రైవేట్ వాహనాల రిజిస్ట్రేషన్ మొత్తం కొత్త ప్రైవేట్ వాహనాల్లో 77 శాతంగా(5,538) ఉంది. ఇది నెలవారీగా 29.2 శాతం పెరుగుదల కాగా, సంవత్సరానికి 8.8 శాతం తగ్గుదల నమోదు చేసింది. మరోవైపు, ప్రైవేట్ మోటార్సైకిళ్ల రిజిస్ట్రేషన్ ఫిబ్రవరి 2024లో మొత్తం 142 కాగా, అంతకుముందు నెలలో 360గా ఉంది. వాహనాల రిజిస్ట్రేషన్లు పెరగడం దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందనడానికి సంకేతంగా మార్కెట్ నిపుణులు తెలిపారు. ఫిబ్రవరి 2024లో వాహనాల ప్రక్రియల క్లియరింగ్ డేటా 128,002గా ఉంది. వార్షిక పెరుగుదల వరుసగా 2.7 శాతం మరియు నెలవారీ క్షీణత 7.3 శాతంగా ఉన్నట్లు నివేదిక చూపింది. ఫిబ్రవరి 2024లో నమోదైన మొత్తం ట్రాఫిక్ ఉల్లంఘనల్లో, వేగ పరిమితి ఉల్లంఘన (రాడార్) 78 శాతం ఉండగా, స్టాండ్ అండ్ వెయిట్ నియమాలు మరియు బాధ్యతల ఉల్లంఘనలు 12 శాతం ఉన్నాయి. వాహనాల వేగ పరిమితి ఉల్లంఘన (రాడార్) నెలవారీ ప్రాతిపదికన 3.6 శాతం క్షీణతను నమోదు చేస్తూ 1230,348 వద్ద ఉంది. ఫిబ్రవరి 2024లో ట్రాఫిక్ సిగ్నల్ ఉల్లంఘనలు నెలవారీ ప్రాతిపదికన 8.9 శాతం తగ్గుదలని చూపుతూ 5,880కి చేరుకున్నాయి.
తాజా వార్తలు
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇరాన్ డ్రోన్ దాడిలో దెబ్బతిన్న కువైట్ విద్యుత్ కేంద్రం..!!
- అల్ ఖబౌరాలో నీటమునిగి బాలుడు మృతి..!!
- 20 మిలియన్ దిర్హమ్ల గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయుడు..!!
- ఖతార్ లో పిల్లల భద్రతాకు మార్గదర్శకాలు జారీ..!!
- ఐఎమ్డి స్మార్ట్ సిటీ ఇండెక్స్లో 8 సౌదీ నగరాలు..!!
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు









