తెలంగాణ సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్ కన్నుమూత
- April 09, 2024
హైదరాబాద్: సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్ గుండెపోటుతో మృతిచెందారు. తెల్లవారు జామున ఆయనకు ఛాతినొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటీన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రాజీవ్ రతన్ ప్రస్తుతం తెలంగాణ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా కొనసాగుతున్నారు. రాజీవ్ రతన్ మృతిపట్ల పలువురు సంతాపం తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డితోపాటు పలువురు మంత్రులు, సీనియర్ ఐపీఎస్ అధికారులు, కొంతమంది ఐఏఎస్ అధికారులు సంతాపం తెలిపారు. రాష్ట్రానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.
2004 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన రాజీవ్ రతన్ గతంలో కరీంనగర్ ఎస్పీగా పనిచేశారు. ఫైర్ సర్వీస్ డీజీగా, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గానూ బాధ్యతలు నిర్వర్తించారు. తెలంగాణలోని అనేక విభాగాల్లో పనిచేసి ఎంతో పేరు ప్రతిష్టలు గడించారు. ప్రస్తుతం ఇంటిలిజెన్స్ డీజీగా ఉన్న రాజీవ్ రతన్.. కాళేశ్వరం, మేడగడ్డ ప్రాజెక్టుపై విజిలెన్స్ దర్యాప్తు చేపట్టారు. ఇటీవలే మేడిగడ్డపై సీఎం రేవంత్ రెడ్డికి రాజీవ్ రతన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







