తెలంగాణ భవన్లో ఘనంగా ఉగాది వేడుకలు
- April 09, 2024హైదరాబాద్: తెలంగాణ భవన్ లో ఉగాది వేడకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) పాల్గొన్నారు. వేదపండితులు కేటీఆర్ కు వేదాశీర్వచనం అందించారు. అనంతరం పంచాంగం పఠనంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ మాజీ స్పీకర్ మాజీ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు,ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ఇక ఈ ఏడాది కేసీఆర్ జాతకం ఎలా ఉందనేది పండితులు తెలిపారు. తెలంగాణ భవన్ పంచాంగ శ్రవణం ప్రకారం.. కేసీఆర్ రాశి (కర్కాటకం) అత్యంత సంతోషకరంగా ఆదాయ, వ్యయాలు కనిపిస్తున్నాయని పండితులు వివరించారు. అన్ని వ్యవహారాల్లో కేసీఆర్ విజయం సాధిస్తారట. వారి మాటకు, గమనానికి అడ్డులేని సంవత్సరంగా కనిపిస్తోందట. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు కేసీఆర్ తీసుకోవాలని చెబుతున్నారు. వాహన ప్రమాద సూచన ఉంది కాబట్టి ఎక్కువ ప్రయాణాలు చేయొద్దట. ఇక కేసీఆర్ దోష నివారణ కోసం లక్ష్మీ మోహన గణపతిని చవితి నాడు దర్శనం చేసుకోవాలని పండితులు సూచించారు. తెలంగాణ రాష్ట్ర పాలక పక్షంకు ఈ సారి కష్టకాలం ఉందని.. ప్రతి పక్షానికి దిగ్విజయం ఉందని తెలిపారు పండితులు.
తాజా వార్తలు
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు