1584 మంది ఖైదీలకు క్షమాభిక్ష
- April 09, 2024బహ్రెయిన్: హిస్ మెజెస్టి సింహాసనాన్ని అధిష్టించిన సిల్వర్ జూబ్లీని గుర్తు చేస్తూ.. ఈద్ అల్ ఫితర్ సందర్భంగా బహ్రెయిన్ సాయుధ దళాల సుప్రీం కమాండర్ హిస్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా.. దోషులుగా తేలిన 1,584 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి అయిన హిస్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా అధ్యక్షతన నిన్న జరిగిన కేబినెట్, హెచ్ఎం రాజు రాయల్ డిక్రీని జారీ చేయడాన్ని ప్రశంసించింది. బహ్రెయిన్ లో సామాజిక నిర్మాణాన్ని పరిరక్షిస్తూ, ప్రజా ప్రయోజనాలను సమర్థిస్తూ, వ్యక్తిగత మరియు పౌర హక్కులను కాపాడుతుందని అభినందించింది. క్షమాభిక్ష పొందిన వ్యక్తులకు శిక్షణా కార్యక్రమాలను అందించాలని, ఉద్యోగ అవకాశాలను మెరుగు పరచాలని కార్మిక మంత్రిత్వ శాఖను HRH ప్రిన్స్ సల్మాన్ ఆదేశించారు. ఈద్ ను పురస్కరించుకొని హెచ్ఎం కింగ్ హమద్.. బహ్రెయిన్ ప్రజలకు మరియు అన్ని అరబ్, ఇస్లామిక్ దేశాలకు శుభాకాంక్షలు తెలియజేసారు.
తాజా వార్తలు
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు