తొలిసారిగా విజయవాడ బస్టాండ్‌లో మల్లీప్లెక్స్‌ థియేటర్‌

- June 06, 2016 , by Maagulf
తొలిసారిగా విజయవాడ బస్టాండ్‌లో మల్లీప్లెక్స్‌ థియేటర్‌

దేశంలో బస్టాండ్ల రూపురేఖలు మారిపోబోతున్నాయా? ప్రస్తుతం బస్టాండ్లలో టీవీలు ఏర్పాటు చేయడం, వైఫై సౌకర్యం కల్పించడం చూస్తూనే ఉన్నాం. కానీ బస్టాండ్‌లో థియేటర్‌ ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది? ఈ ఆలోచనను నిజం చేసి చూపించింది ఏపీఎస్‌ ఆర్టీసీ. ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన నగరమైన విజయవాడలోని నెహ్రూ బస్టాండ్‌లో మల్టీప్లెక్స్‌ అందుబాటులోకి వచ్చింది. 'వై స్క్రీన్స్‌' సంస్థ దేశంలోనే తొలిసారిగా విజయవాడ బస్టాండ్‌లో మల్లీప్లెక్స్‌ థియేటర్‌ను ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈరోజు 'వై స్క్రీన్స్‌' మల్టీప్లెక్స్‌ థియేటర్‌ను ప్రారంభించారు. అత్యాధునిక వసతులతో ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకుంటున్న విజయవాడ బస్టాండ్‌... మల్లీప్లెక్స్‌ ఏర్పాటుతో దేశంలోనే ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించుకుంది

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com