మనవరాళ్లతో కలిసి ఈద్ అల్ ఫితర్ జరుపుకున్న షేక్ మొహమ్మద్

- April 11, 2024 , by Maagulf
మనవరాళ్లతో కలిసి ఈద్ అల్ ఫితర్ జరుపుకున్న షేక్ మొహమ్మద్

యూఏఈ: అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తన కుటుంబం మరియు మనవరాళ్లతో కలిసి ఈద్ అల్ ఫితర్ జరుపుకున్నారు. తన మనవళ్లతో గడిపిన సన్నిహిత క్షణాన్ని పంచుకుంటూ షేక్ మొహమ్మద్ సోషల్ మీడియాలో ఫోటో ని షేర్ చేశారు. అంతకు ముందు షేక్ మొహమ్మద్  అబుదాబిలోని షేక్ జాయెద్ గ్రాండ్ మసీదులో భక్తులతో కలిసి ఈద్ అల్ ఫితర్ ప్రార్థనను నిర్వహించారు. ప్రార్థన అనంతరం అందరికి శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం దివంగత షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ సమాధిని సందర్శించి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థనలు జరిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com