పార్లమెంటు ఎన్నికలపై కాంగ్రెస్ ఎన్నారై విభాగం సమీక్ష
- April 13, 2024
16న సీఎం రేవంత్ రెడ్డితో హైదరాబాద్ లో గల్ఫ్ సంఘాల ప్రతినిధులతో సమావేశం
హైదరాబాద్: రాబోయే పార్లమెంటు ఎన్నికలలో గల్ఫ్ కార్మికుల కుటుంబాలు, ఎన్నారైలు కాంగ్రెస్ పార్టీ పట్ల సానుకూలంగా ఉన్నారని టీపీసీసీ ఎన్నారై సెల్ చైర్మన్ డా. బిఎం వినోద్ కుమార్ అన్నారు. శనివారం హైదరాబాద్ లో జరిగిన సమీక్షలో టీపీసీసీ ఎన్నారై సెల్ పార్లమెంట్ ఎన్నికల కోఆర్డినేటర్ స్వదేశ్ పరికిపండ్లతో నియోజకవర్గాల వారీగా ఉన్న పరిస్థితిని వినోద్ కుమార్ సమీక్షించారు. ఈనెల 16న సీఎం రేవంత్ రెడ్డితో హైదరాబాద్ లో గల్ఫ్ సంఘాల ప్రతినిధులతో సమావేశం ఉన్నదని ఆయన తెలిపారు.
రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వంద రోజులలోనే గల్ఫ్ కార్మికులకు ఇచ్చిన హామీల అమలుకు శ్రీకారం చుట్టడం వలన గల్ఫ్ కార్మికుల కుటుంబాలు ఈ ఎన్నికలలో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారని వారు నిర్ధారణకు వచ్చారు. గల్ఫ్ వలసలు అధికంగా ఉన్న నిజామాబాద్, కరీంనగర్ ఆదిలాబాద్, జహీరాబాద్, మెదక్, వరంగల్ ఎంపీ స్థానాలలో గల్ఫ్ ఓటు బ్యాంకు ప్రభావం గణనీయంగా ఉంటుందని ఈ నియోజకవర్గాలలో ఎన్నారై విభాగం బృందం ప్రత్యేక ప్రచార కార్యాచరణ చేపట్టిందని వినోద్ కుమార్ తెలిపారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







