సీఎం జగన్ పై రాళ్లదాడి.. కంటిపై గాయం.. వీడియో
- April 13, 2024ఆంధ్రప్రదేశ్ రాజకీయలు హాట్ హాట్ గా మారుతున్నాయి. విమర్శలతో మొదలైన మాటల యుద్ధం ఇప్పుడు బౌతిక దాడుల చేసుకునేలా పలు ఘటనలు చోటుచేసుకోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇలాంటి సమయంలో ముఖ్యమత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై రాళ్లదాడి జరిగింది. విజయవాడలో బస్సుయాత్ర సందర్భంగా సీఎం జగన్ పై కొందరు ఆగంతకులు రాళ్లు విసరడం కలకలం రేపింది. బస్సు యాత్ర ఘనంగా సాగుతున్న సమయంలో పార్టీ శ్రేణులు పూల వర్షం కురిపించాయి. ఇదే సమయంలో కొందరు దుండగులు రాళ్లను కూడా విసిరారు.
దీంతో జగన్ పై పడ్డ రాళ్లతో ఆయన ఎడమ కంటికి గాయం అయింది. కను బొమ్మపై రాయి తగలడంతో గాటు పడింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ జగన్ కు రాళ్లదాడిని అడ్డుకున్నారు. సీఎం జగన్ ను కవర్ చేస్తూ నిలబడ్డారు. ఆ తర్వాత వాహనం లోపలికి తీసుకెళ్లారు. అక్కడ ప్రథమ చికిత్సను అందించాడు. వైద్యులు పరిశీలించిన తర్వాత జగన్ తన బస్సు యాత్రను మళ్లీ ప్రారంభించాడు.
విజయవాడలో జగనన్న పై దాడి చేసిన పచ్చ గూండాలు!
— YS Jagan Trends ™ Siddham (@YSJaganTrends) April 13, 2024
మేమంత సిద్ధం యాత్రకి వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక విజయవాడలో జగనన్న బస్సుపై ఉండగా అన్న పై దాడి చేయించిన చంద్రబాబు. 💔😢
నువ్వు నీచుడివని తెలుసు, మరీ ఇంత నీచుడివని తెలియదు చంద్రబాబు!
Be Careful Jagananna! 😢🙏🏻#YSJagan |… pic.twitter.com/qrWSyIRw5c
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు