ఇక ఆ ప్రాజెక్ట్పై ఫోకస్ పెట్టాల్సిందే.!
- April 13, 2024‘జగదేవక వీరుడు అతిలోక సుందరి’ సినిమా అప్పట్లో ఓ అద్భుతమైన దృశ్య కావ్యం. ఆ సినిమాకి చాలా సార్లు సీక్వెల్ రూపొందించాలని అనుకున్నారు నిర్మాత అశ్వనీ దత్. కానీ కుదరలేదు.
సెకండ్ జనరేషన్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ అతిలోక సుందరి జాన్వీ కపూర్ వచ్చాకా కూడా ఈ ప్రాజెక్ట్పై కసరత్తులు జరిగాయ్ కానీ, అదీ కుదరలేదు.
ఇక, ఇప్పుడు.. ఆ సమయం రానే వచ్చిందనిపిస్తోంది. ఎట్టకేలకు ఈ క్రేజీ కాంబినేషన్ అయితే సెట్టయ్యింది. బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా కోసం రామ్ చరణ్, జాన్వీ కపూర్ జత కడుతున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా ఓపెనింగ్ ఫంక్షన్లోనే ఈ ప్రాజెక్ట్ గురించి రామ్ చరణ్ నోటి వెంట ఈ ప్రాజెక్ట్ చర్చకొచ్చింది. తాజాగా మరోసారి మెగాస్టార్ చిరంజీవి తన మనసులోని మాట బయట పెట్టారు.
రామ్ చరణ్, జాన్వీ కపూర్ కాంబినేషన్లో ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చూడాలన్నది తన డ్రీమ్ అని ఆయన అన్నారు. ఇంకేముంది.! అందరికీ ఆ కోరిక వుంది. సో, విజయేంద్ర ప్రసాద్ వంటి ప్రముఖులు ఈ సీక్వెల్కి స్ర్కిప్ట్ సిద్దం చేయడమే తరువాయి.!
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు