ఏపీ: పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు
- April 14, 2024
అమరావతి: ఏపీ రాష్ట్రంలో సోమవారం 170 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీస్తాయని ఎపి విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. 31 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీయనుండగా.. 139 మండలాల్లో అతి తీవ్ర స్థాయిలో ఈ వడగాడ్పులు ఉంటాయని పేర్కొంది. పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కొనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ఏలూరు, ఎన్టిఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని మండలాల్లో ఈ వడగాడ్పుల ప్రభావం ఉండ నుంది. మంగళవారం కూడా 146 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని ఆ సంస్థ తెలిపింది. కాగా, ఆదివారం నంద్యాల జిల్లా గోస్పాడులో అత్యధికంగా 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మన్యం జిల్లా నవగాం, విజయనగరం జిల్లా తుమ్మికాపల్లి, శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో 43.3 డిగ్రీల చొప్పున, వైఎస్ఆర్ జిల్లా సింహాద్రిపురం, అనకాపల్లి జిల్లా దేవరపల్లిలో 42.4 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









