ఇరాన్-ఇజ్రాయెల్ సంక్షోభం వేళ ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు!
- April 15, 2024న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య సంక్షోభం నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు. విదేశాల్లోని భారతీయుల రక్షణ తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి వస్తే..ఉద్రిక్తతలు చెలరేగుతున్న ప్రాంతాలలో ఉన్న భారతీయ పౌరుల జీవితాలకు భద్రతకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. కాగా, సిరియాలోని ఎంబసీ కార్యాలయంపై వైమానిక దాడికి ప్రతిస్పందనగా ఇజ్రాయెల్పై ఇరాన్ 300కి పైగా క్షిపణులు ప్రయోగించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. “ఇటీవల ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల మధ్య తరచూ అనిశ్చిత పరిస్థితులు నెలకొంటున్నాయి. అనేక ప్రాంతాలలో యుద్ధం లాంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తంగా ఉంది. ప్రపంచ దేశాల్లో శాంతి లేదు. ఇటువంటి సమయంలో దేశ పౌరుల భద్రతకు భరోసా ఇవ్వడం చాలా ముఖ్యం. విదేశాలలో ఉంటున్న మన ప్రజల భద్రతే మా ప్రభుత్వం లక్ష్యం. యుద్ధ భయం ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న ఈ సమయంలో పూర్తి మెజారిటీతో బలమైన, స్థిరమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం అనేది ప్రజల ముందు ఉన్న తక్షణ కర్తవ్యం. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా దేశాన్ని ఆర్థికంగా మరింత దృఢంగా మార్చే ప్రభుత్వం అవసరం. ప్రపంచ సవాళ్లను ఎదుర్కొంటూ.. ‘విక్షిత్ భారత్’ దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది” అని ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు.
ఇక ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తత నేపథ్యంలో అక్కడ ఉంటున్న భారతీయులను స్వదేశానికి తరలించేందుకు కేంద్రం చర్యలు చేపడుతోంది. గతేడాది అక్టోబర్లో ఇజ్రాయెల్, హమాస్ మధ్య దాడులు జరిగిన సమయంలో కూడా భారత ప్రభుత్వం ఇజ్రాయెల్లోని మన వారిని స్వదేశానికి తీసుకురావడానికి ఆపరేషన్ అజయ్ చేపట్టింది. తద్వారా 1,309 మంది భారత పౌరులు, 14 మంది ఓసీఐ కార్డుదారులు, 20 మంది నేపాలీలను తరలించడం జరిగింది. అలాగే రష్యా, ఉక్రెయిన్ మధ్య వార్ సమయంలో మోదీ ప్రభుత్వం ఆపరేషన్ గంగా ద్వారా 25వేల మంది భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చింది.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం