మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ..!18 మంది మృతి..!
- April 16, 2024
ఛత్తీస్గఢ్లోని కంకేర్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. 18 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. కంకేర్ జిల్లాలో భద్రతా బలగాలు, నక్సలైట్లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పులలో మావోయిస్టులకు భారీ ప్రాణ నష్టం జరిగింది.
ఛోటేబైథియా పోలీస్ స్టేషన్లోని కల్పర్ అటవీ ప్రాంతంలో ఈ కాల్పులు జరిగాయి. ఘటనా స్థలం నుంచి ఒక AK47తో పాటు INSAS రైఫిల్ ను జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. ఎదురు కాల్పుల్లో ఇన్స్పెక్టర్ సహా ఇద్దరు BSF జవాన్లకు గాయాలయ్యాయి. ఎదురు కాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టుల సంఖ్యను పోలీసు ఉన్నతాధికారులు నిర్దారించాల్సి ఉంది. కాగా, మావోయిస్టుల ఎన్ కౌంటర్ ను ఎస్పీ ఇంద్ర కళ్యాణ్ ధృవీకరించారు.
తాజా వార్తలు
- ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధం
- పద్మ అవార్డుల కోసం నామినేషన్ల స్వీకరణ
- కేంద్రం సంచలనం..వాళ్లంతా గ్యాస్ సిలిండర్స్ వెనక్కి ఇచ్చేయాలి..
- నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్
- ఇదీ మీ ప్రభుత్వం...కలిసి ముందుకు సాగుదాం: సీఎం రేవంత్
- గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్, 2 చిన్నారులు మృతి, 7 మందికి గాయాలు
- వాట్సాప్ నుంచే హాస్పిటల్ OP రిజిస్ట్రేషన్లు
- గల్ఫ్ జనసేన కువైట్ ఆధ్వర్యంలో కువైత్ లో రక్తదాన కార్యక్రమం
- రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
- తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు









