మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ..!18 మంది మృతి..!
- April 16, 2024ఛత్తీస్గఢ్లోని కంకేర్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. 18 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. కంకేర్ జిల్లాలో భద్రతా బలగాలు, నక్సలైట్లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పులలో మావోయిస్టులకు భారీ ప్రాణ నష్టం జరిగింది.
ఛోటేబైథియా పోలీస్ స్టేషన్లోని కల్పర్ అటవీ ప్రాంతంలో ఈ కాల్పులు జరిగాయి. ఘటనా స్థలం నుంచి ఒక AK47తో పాటు INSAS రైఫిల్ ను జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. ఎదురు కాల్పుల్లో ఇన్స్పెక్టర్ సహా ఇద్దరు BSF జవాన్లకు గాయాలయ్యాయి. ఎదురు కాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టుల సంఖ్యను పోలీసు ఉన్నతాధికారులు నిర్దారించాల్సి ఉంది. కాగా, మావోయిస్టుల ఎన్ కౌంటర్ ను ఎస్పీ ఇంద్ర కళ్యాణ్ ధృవీకరించారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..