మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ..!18 మంది మృతి..!

- April 16, 2024 , by Maagulf
మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ..!18 మంది మృతి..!

ఛత్తీస్‌గఢ్‌లోని కంకేర్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. 18 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. కంకేర్ జిల్లాలో భద్రతా బలగాలు, నక్సలైట్లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పులలో మావోయిస్టులకు భారీ ప్రాణ నష్టం జరిగింది.

ఛోటేబైథియా పోలీస్ స్టేషన్‌లోని కల్పర్ అటవీ ప్రాంతంలో ఈ కాల్పులు జరిగాయి. ఘటనా స్థలం నుంచి ఒక AK47తో పాటు INSAS రైఫిల్ ను జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. ఎదురు కాల్పుల్లో ఇన్‌స్పెక్టర్‌ సహా ఇద్దరు BSF జవాన్లకు గాయాలయ్యాయి. ఎదురు కాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టుల సంఖ్యను పోలీసు ఉన్నతాధికారులు నిర్దారించాల్సి ఉంది. కాగా, మావోయిస్టుల ఎన్ కౌంటర్ ను ఎస్పీ ఇంద్ర కళ్యాణ్ ధృవీకరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com