రైతు బీమాలాగే గల్ఫ్ కార్మికులకు బీమా సౌకర్యం.. సీఎం రేవంత్ రెడ్డి
- April 16, 2024
హైదరాబాద్: రైతు బీమాలాగే గల్ఫ్ కార్మికులకు బీమా సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గల్ఫ్ కార్మికులకు న్యాయపరమైన సాయం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్న ఆయన.. కేరళ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కూడా అధ్యయనం చేసామని తెలిపారు. గల్ఫ్ కార్మిక సంఘాల నాయకులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. ఉత్తర తెలంగాణ నుంచి ఎక్కువ మంది గల్ఫ్ కార్మికులు ఉన్నారని గుర్తు చేశారు.
“ఏజెంట్ల బారిన పడి కొందరు, యాజమాన్యం చేతిలో మరికొందరు కార్మికులు ఇబ్బంది పడుతున్నారు.గల్ఫ్ మరియు ఇతర దేశాలకు వెళ్లే కార్మికుల కోసం ప్రత్యేక బోర్డ్ ఏర్పాటుకు అధ్యయనం చేస్తున్నాం.ఇందు కోసం ప్రజా భవన్ లో ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఒక టోల్ ఫ్రీ నంబరు ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేసే వ్యవస్థను ఏర్పాటు చేస్తాం.సెప్టెంబర్ 17 లోగా మీ సమస్యల పరిష్కారానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తాం.
ఫిలిప్పీన్ విధానాలను మేం స్పష్టంగా అధ్యయనం చేసాం.ఇప్పటికే గల్ఫ్ కార్మికుల కోసం ఒక పాలసీ డాక్యుమెంట్ తయారు చేసాం.ఎన్నికల కోడ్ ముగిశాక ప్రభుత్వం తరపున మరోసారి గల్ఫ్ కార్మిక సంఘాల నాయకులతో సమావేశమవుతాము.పాలసీ డాక్యుమెంట్ పై మీ అభిప్రాయాలను, సూచనలను తీసుకుని ముందుకెళతాం.ఏజెంట్ల చేతుల్లో మోసపోకుండా చర్యలు తీసుకోబోతున్నము.ఏజెంట్లు రాష్ట్ర ప్రభుత్వం వద్ద నమోదు చేసుకునేలా చర్యలు తీసుకుంటాం.
గల్ఫ్ వెళ్లే వారికి ఒక వారం రోజులు శిక్షణ అందించేందుకు చర్యలు చేపట్టాలని భావిస్తున్నాం.” అని గల్ఫ్ కార్మిక సంఘాల నాయకులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

తాజా వార్తలు
- ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధం
- పద్మ అవార్డుల కోసం నామినేషన్ల స్వీకరణ
- కేంద్రం సంచలనం..వాళ్లంతా గ్యాస్ సిలిండర్స్ వెనక్కి ఇచ్చేయాలి..
- నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్
- ఇదీ మీ ప్రభుత్వం...కలిసి ముందుకు సాగుదాం: సీఎం రేవంత్
- గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్, 2 చిన్నారులు మృతి, 7 మందికి గాయాలు
- వాట్సాప్ నుంచే హాస్పిటల్ OP రిజిస్ట్రేషన్లు
- గల్ఫ్ జనసేన కువైట్ ఆధ్వర్యంలో కువైత్ లో రక్తదాన కార్యక్రమం
- రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
- తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు









