తెలంగాణ: ఇంటి యజమానులకు బల్దియా బంపరాఫర్
- April 16, 2024హైదరాబాద్: హైదరాబాద్ లో మీకు సొంత ఇల్లు, ప్లాట్, ఫ్లాట్ ఏదైనా ఉందా.. ఐతే.. మీకే ఈ వార్త. హైదరాబాద్ వాసులకు ముఖ్య గమనిక అందించారు నగర పాలక సంస్థ అధికారులు. ఎర్లీబర్క్ స్కీమ్ బల్దియా అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. 2024 - 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్నును చెల్లించడానికి ఎర్లీబర్డ్ పథకాన్ని వినియోగించుకొని 5 శాతం రాయితీ పొందాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ సూచించారు. ఈ నెల 30వ తేదీలోపు ఆస్తిపన్ను చెల్లించి 5 శాతం రాయితీ పొందాలని తెలిపారు. ప్రతీ ఏడాది లాగానే ఈ సంవత్సరం కూడా.. రాయితీని వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు. కొత్త ఆర్థిక సంవత్సరంలో పన్ను వసూళ్లపై గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ దృష్టి సారించింది. 2024-25 ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్ను చెల్లింపునకు సంబంధించి ఎర్లీబర్డ్ పథకాన్ని ఆమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఈ పథకం కింద రూ.230 కోట్ల ఆదాయం సమకూరిందని, నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొవాలన్నారు. ఈ పథకం ద్వారా రూ.800 కోట్ల పన్నులు వసూలు చేయాలని జీహెచ్ఎంసీ లక్ష్యంగా పెట్టుకుంది.
తాజా వార్తలు
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా