తెలంగాణ: ఇంటి యజమానులకు బల్దియా బంపరాఫర్
- April 16, 2024హైదరాబాద్: హైదరాబాద్ లో మీకు సొంత ఇల్లు, ప్లాట్, ఫ్లాట్ ఏదైనా ఉందా.. ఐతే.. మీకే ఈ వార్త. హైదరాబాద్ వాసులకు ముఖ్య గమనిక అందించారు నగర పాలక సంస్థ అధికారులు. ఎర్లీబర్క్ స్కీమ్ బల్దియా అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. 2024 - 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్నును చెల్లించడానికి ఎర్లీబర్డ్ పథకాన్ని వినియోగించుకొని 5 శాతం రాయితీ పొందాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ సూచించారు. ఈ నెల 30వ తేదీలోపు ఆస్తిపన్ను చెల్లించి 5 శాతం రాయితీ పొందాలని తెలిపారు. ప్రతీ ఏడాది లాగానే ఈ సంవత్సరం కూడా.. రాయితీని వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు. కొత్త ఆర్థిక సంవత్సరంలో పన్ను వసూళ్లపై గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ దృష్టి సారించింది. 2024-25 ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్ను చెల్లింపునకు సంబంధించి ఎర్లీబర్డ్ పథకాన్ని ఆమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఈ పథకం కింద రూ.230 కోట్ల ఆదాయం సమకూరిందని, నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొవాలన్నారు. ఈ పథకం ద్వారా రూ.800 కోట్ల పన్నులు వసూలు చేయాలని జీహెచ్ఎంసీ లక్ష్యంగా పెట్టుకుంది.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..