హైదరాబాద్లో జోరు వాన..
- April 20, 2024
హైదరాబాద్: హైదరాబాద్ లో శనివారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, దిల్ షుఖ్ నగర్, ఎల్బీ నగర్, ఉప్పల్, తార్నాక, హిమాయత్ నగర్, అబిడ్స్, సికింద్రాబాద్ ప్రాంతాలతో పాటు.. రాజేంద్రనగర్, తుర్కయాంజల్, కొత్తపేట, సరూర్ నగర్, నాగోల్, చైతన్యపురి, చంపాపేట, సైదాబాద్ లో వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది.
ఉదయాన్నే నల్లని మబ్బులు ఆకాశాన్ని కమ్ముకోవడంతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురవగా.. పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షం కురిసింది. దీంతో ఉదయాన్నే కార్యాలయాలకు వెళ్లేందుకు బయలుదేరిన ఉద్యోగులు, స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు ప్రాంతాల్లోని రహదారులపై వర్షంపు నీరు నిలిచిపోవటంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పలేదు. హైదరాబాద్ శివారు ప్రాతాల్లోనూ వర్షం కురిసింది. లంఘార్ హౌస్, షేక్ పెట్, నార్సింగీ, గండిపేట్, హిమాయత్ సాగర్, పుప్పాల్ గూడ, మణికొండ ప్రాంతాలలోనూ వర్షం కురిసింది. ఖైరతాబాద్, శేరిలింగంపల్లి జోన్లలో ఉదయం నుంచి వర్షం కురుస్తుంది.
గత కొద్ది రోజులుగా వేసవి ఎండలు, ఉక్కపోతతో హైదరాబాద్ నగరవాసులు అల్లాడిపోతున్నారు. మధ్యాహ్నం వేళ బయటకు రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. శనివారం ఉదయం నుంచి దాదాపు నగర వ్యాప్తంగా వర్షం కురవడంతో ఎండ వేడిమి, ఉక్కపోత నుంచి నగర వాసులకు కొంత ఉపశమనం కలిగినట్లయింది. ఇదిలాఉంటే.. రాష్ట్రంలో పలు జిల్లాల్లోనూ ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. జగిత్యాల, జనగాం, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, కరీంనగర్, మహబూబ్ నగర్, మెదక్, మేడ్చల్ మల్కాజ్ గిరి, నాగర్ కర్నూల్, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వనపర్తి, హనుమకొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురవగా.. పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- తెలంగాణ లో మహిళా పెట్రోల్ బంకులు
- ఇద్దరు ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ సెల్స్ అరెస్ట్: ఖతార్
- 166 మిస్సైల్స్, డ్రోన్లను ధ్వంసం చేశాం: బహ్రెయిన్
- కువైట్ పై దాడులకు తెగబడ్డ ఇరాన్..!!
- కువైట్లో సైనికుల మృతి పట్ల ఒమన్ సంతాపం..!!
- దౌత్యాధికారులకు ఇఫ్తార్ విందు ఇచ్చిన సౌదీ అరేబియా..!!
- డిస్టెన్స్ లెర్నింగ్ మార్చి 6 వరకు పొడిగించిన యూఏఈ..!!
- 1,000 కి పైగా ఇరానియన్ దాడులు: యూఏఈ
- అమెరికా కాన్సులేట్ పై డ్రోన్ అటాక్ పై దుబాయ్ క్లారిటీ..!!
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్పోర్ట్లు.. కేంద్ర మంత్రి సమీక్ష









