కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్
- April 20, 2024![1 కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్](https://www.maagulf.com/godata/articles/202404/lkk_1713600126.jpg)
అమరావతి: కడప నుంచి లోక్సభ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు చేశారు. వైఎస్ వివేకా కుమార్తె సునీతతో కలిసి కడప కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను అందించారు. అంతకుముందు ఇడుపులపాయలో వైఎస్ ఘాట్ వద్ద నామినేషన్ పత్రాలను ఉంచి షర్మిల నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కడప నియోజకవర్గ ప్రజలు ఈ ఎన్నికల్లో మంచి తీర్పు ఇస్తారని భావిస్తున్నట్టు పేర్కొన్నారు.
అంతకుముందు షర్మిల ఎక్స్లో పోస్టును షేర్ చేస్తూ.. ‘‘ఒక అపురూప ఘట్టం ఆవిష్కరించబోతున్న ఈ సందర్భంలో, దేవుని దీవెనలు, నాన్న ఆశీర్వాదం, నా ప్రియమైన అమ్మ, ముద్దుల బిడ్డల శుభాకాంక్షలు అందుకుని, న్యాయం కొరకు, విజయం వైపు ఈ అడుగు వేస్తున్నాను. వైఎస్ రాజశేఖర్రెడ్డి గారిని, వైఎస్ వివేకానందరెడ్డి గారిని మరిచిపోలేని ప్రజలు, అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నా. ధర్మం వైపే మన కడప ప్రజలు నిలబడతారని ఆశిస్తుంది మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ’’ అని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- నవజాత శిశువుల స్క్రీనింగ్.. యూఏఈలో కొత్త మార్గదర్శకాలు
- 'మాస్టర్ ఆఫ్ డవలప్ మెంట్ ఎక్సలెన్స్ అవార్డు-2024'ను సొంతం చేసుకున్న అన్వితా గ్రూప్
- రేపటి భారత క్రీడా షెడ్యూల్ ఇదే..
- మద్యం కుంభకోణంలో జగన్ ను వదిలేది లేదు: మంత్రి కొల్లు రవీంద్ర
- షిర్డీ సాయినాధుని సేవలో ఏపీ గవర్నర్
- ఆసియా కప్: పాక్ పై విజయం…ఫైనల్స్ కు శ్రీలంక
- ఇంజినీరింగ్ విద్యార్థులకు శుభవార్త
- రాచకొండ సిబ్బంది సంక్షేమానికి అధిక ప్రాధాన్యం: సిపీ సుధీర్ బాబు
- విషాదం..భవనం పైకప్పుపై ప్రవాస భారతీయుడి మృతదేహం లభ్యం..!
- యూఏఈలో గెలాక్సీ ఇన్సూరెన్స్ బ్రోకర్ లైసెన్స్ రద్దు