కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్
- April 20, 2024
అమరావతి: కడప నుంచి లోక్సభ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు చేశారు. వైఎస్ వివేకా కుమార్తె సునీతతో కలిసి కడప కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను అందించారు. అంతకుముందు ఇడుపులపాయలో వైఎస్ ఘాట్ వద్ద నామినేషన్ పత్రాలను ఉంచి షర్మిల నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కడప నియోజకవర్గ ప్రజలు ఈ ఎన్నికల్లో మంచి తీర్పు ఇస్తారని భావిస్తున్నట్టు పేర్కొన్నారు.
అంతకుముందు షర్మిల ఎక్స్లో పోస్టును షేర్ చేస్తూ.. ‘‘ఒక అపురూప ఘట్టం ఆవిష్కరించబోతున్న ఈ సందర్భంలో, దేవుని దీవెనలు, నాన్న ఆశీర్వాదం, నా ప్రియమైన అమ్మ, ముద్దుల బిడ్డల శుభాకాంక్షలు అందుకుని, న్యాయం కొరకు, విజయం వైపు ఈ అడుగు వేస్తున్నాను. వైఎస్ రాజశేఖర్రెడ్డి గారిని, వైఎస్ వివేకానందరెడ్డి గారిని మరిచిపోలేని ప్రజలు, అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నా. ధర్మం వైపే మన కడప ప్రజలు నిలబడతారని ఆశిస్తుంది మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ’’ అని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్







