కాషాయ రంగులో దూరదర్శన్ లోగో.. ప్రతిపక్షాల విమర్శలు
- April 20, 2024
న్యూఢిల్లీ: దూరదర్శన్ లోగో తన రంగును ఎరుపు నుంచి ఆరెంజ్ రంగుకు మార్చారు. కాషాయ రంగుంలో ఉన్న ఆ లోగోపై వివాదం చెలరేగుతున్నది. దూరదర్శన్కు చెందిన డీడీ న్యూస్ ఇంగ్లీష్ ఛానల్.. కొత్త రంగులో ఉన్న లోగోను ప్రమోట్ చేస్తూ వీడియోను తన ఎక్స్ అకౌంట్లో పోస్టు చేసింది. విలువలు అలాగే ఉన్నాయని, కానీ మేం ఇప్పుడు కొత్త అవతారంలో దర్శనం ఇస్తున్నామని, గతంలో ఎన్నడూ లేని రీతిలో వార్తా ప్రయాణానికి స్వాగతం అని, డీడీ న్యూస్ను కొత్తగా అనుభవించండి అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
లోగో రంగును మార్చడం పట్ల తృణమూల్ ఎంపీ జవహర్ సిర్చర్ విమర్శలు చేశారు. ఆ లోగో రంగు తగిన విధంగా లేదన్నారు. దూరదర్శన్ లోగోను కాషాయంలోకి మార్చడం చాలా బాధగా ఉందని, ఇప్పుడు ఇది ప్రసార భారతి కాదు అని, ప్రచార భారతిగా మారిందని మాజీ సీఈవో తన పోస్టులో విమర్శించారు. గతంలో ప్రసార భారతి సీఈవోగా సిర్చర్ బాధ్యతలు నిర్వర్తించారు. 2012 నుంచి 2016 వరకు ఆయన డీడీ, ఆల్ ఇండియా రేడియోకు సీఈవోగా చేశారు. లోగోకు కొత్త రంగు వేయడం ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు అవుతుందని ఆరోపించారు.
అయితే ప్రసార భారతి ప్రస్తుత సీఈవో మాత్రం సిర్చర్ వ్యాఖ్యలను ఖండించారు. విజువల్ ఈస్థటిక్స్కు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఆరెంజ్ కలర్ లోగోను తయారు చేసినట్లు ఆయన చెప్పారు. ఛానల్ బ్రాండింగ్, విజువల్ ఈస్తటిక్స్ ఆధారంగా కలర్ను ఎంపిక చేశామని, లోగో ఒక్కటే కాదు, డీడీ ఛానల్ లుక్, ఫీల్ను అప్గ్రేడ్ చేశామన్నారు. కొత్త లైటింగ్, ఎక్విప్మెంట్ను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- డీజీపీ కార్యాలయంలో సీవీ ఆనంద్ సడన్ ఇన్స్పెక్షన్
- దుబాయ్ ఆకాశంలో స్కైడైవింగ్ స్టంట్స్తో ఆకట్టుకున్న షేక్ హమ్దాన్
- యూఏఈ పర్యాటక రంగంలో 2025లో గణనీయ వృద్ధి: షేక్ మహమ్మద్ సమీక్ష
- ఈద్ అల్ అధా శుభాకాంక్షలు తెలుపుకున్న యూఏఈ అధ్యక్షుడు, ఒమాన్ సుల్తాన్
- ఈద్ అల్ అధా సందర్భంగా 104 మంది ఖైదీలకు ఫుజైరా రూలర్ క్షమాభిక్ష
- బాలికపై అత్యాచార కేసు ప్రెస్ మీట్లో నవ్విన అధికారులపై సీఎం విజయ్ సస్పెన్షన్ వేటు!
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు
- దేశ ఆర్థిక వ్యవస్థ పై నిరాశావాదుల ప్రచారం నమ్మొద్దు: ఆర్థిక మంత్రి నిర్మలమ్మ!
- తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షం...
- బాలీవుడ్ హీ మ్యాన్ ధర్మేంద్రకు పద్మవిభూషణ్









