ప్రతి ఒక్కరూ ఓటు హక్కును ఉపయోగించుకోవాలి: జస్టీస్ చంద్రచూడ్
- April 20, 2024
న్యూ ఢిల్లీ: భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ చంద్రచూడ్ ఓటర్లకు కీలక విజ్ఞప్తి చేశారు. ఓటువేసే అవకాశాన్ని ప్రజలు కోల్పోవద్దని సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది పౌరుల ప్రధాన కర్తవ్యం అని అన్నారు. 2024 లోక్సభ ఎన్నికల కోసం ఎన్నికల సంఘం తీసుకొచ్చిన ‘మై ఓట్ మై వాయిస్’ మిషన్ కోసం సీజేఐ ఓ వీడియో సందేశం పంపారు. ‘భారతదేశం ప్రజాస్వామ్యంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఈ దేశంలోని పౌరులుగా మనకు అనేక హక్కులున్నాయి. అలాగే కొన్ని విధులను కూడా నిర్వర్తించాల్సి ఉంటుంది. అందులో మొదటిది ఓటు వేయడమే. దీనిని సక్రమంగా నిర్వర్తించాలి’ అని తెలిపారు.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









