ప్రతి ఒక్కరూ ఓటు హక్కును ఉపయోగించుకోవాలి: జస్టీస్ చంద్రచూడ్
- April 20, 2024
న్యూ ఢిల్లీ: భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ చంద్రచూడ్ ఓటర్లకు కీలక విజ్ఞప్తి చేశారు. ఓటువేసే అవకాశాన్ని ప్రజలు కోల్పోవద్దని సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది పౌరుల ప్రధాన కర్తవ్యం అని అన్నారు. 2024 లోక్సభ ఎన్నికల కోసం ఎన్నికల సంఘం తీసుకొచ్చిన ‘మై ఓట్ మై వాయిస్’ మిషన్ కోసం సీజేఐ ఓ వీడియో సందేశం పంపారు. ‘భారతదేశం ప్రజాస్వామ్యంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఈ దేశంలోని పౌరులుగా మనకు అనేక హక్కులున్నాయి. అలాగే కొన్ని విధులను కూడా నిర్వర్తించాల్సి ఉంటుంది. అందులో మొదటిది ఓటు వేయడమే. దీనిని సక్రమంగా నిర్వర్తించాలి’ అని తెలిపారు.
తాజా వార్తలు
- అబుదాబి నేచురల్ హిస్టరీ మ్యూజియాన్ని సందర్శించిన షేక్ మహమ్మద్
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- దుబాయ్ AIM కాంగ్రెస్లో మధ్యప్రదేశ్ పెట్టుబడి అవకాశాల ప్రదర్శన
- రూ.3 లక్షలు తిరిగి ఇచ్చిన కండక్టర్.. హజ్ యాత్రికుడి డబ్బును భద్రంగా అప్పగింత
- వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు!
- మొదటిసారి ఢిల్లీ బయట జాతీయ అవార్డుల వేడుక..!
- ఇది శాసనసభ కాదు.. దుశ్శాసన సభ: KTR
- జాబ్స్ పేరుతో కోట్లలో మోసం.. 'నందూస్ వరల్డ్' నందన అరెస్ట్..
- సౌదీతో భారత్ సంబంధాల బలోపేతంలో భారత కార్మికుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్
- దుబాయ్లో ప్రముఖ గాయకుడు నిసార్ వయనాడ్ హఠాన్మరణం







