ప్రతి ఒక్కరూ ఓటు హక్కును ఉపయోగించుకోవాలి: జస్టీస్ చంద్రచూడ్
- April 20, 2024
న్యూ ఢిల్లీ: భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ చంద్రచూడ్ ఓటర్లకు కీలక విజ్ఞప్తి చేశారు. ఓటువేసే అవకాశాన్ని ప్రజలు కోల్పోవద్దని సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది పౌరుల ప్రధాన కర్తవ్యం అని అన్నారు. 2024 లోక్సభ ఎన్నికల కోసం ఎన్నికల సంఘం తీసుకొచ్చిన ‘మై ఓట్ మై వాయిస్’ మిషన్ కోసం సీజేఐ ఓ వీడియో సందేశం పంపారు. ‘భారతదేశం ప్రజాస్వామ్యంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఈ దేశంలోని పౌరులుగా మనకు అనేక హక్కులున్నాయి. అలాగే కొన్ని విధులను కూడా నిర్వర్తించాల్సి ఉంటుంది. అందులో మొదటిది ఓటు వేయడమే. దీనిని సక్రమంగా నిర్వర్తించాలి’ అని తెలిపారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- DP World to develop strategic border facilities in Afghanistan under landmark agreement
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!







