వరల్డ్ ఎర్త్ డే
- April 22, 2024వాతావరణ సంక్షోభంపై దృష్టి సారిస్తూ.. ప్రపంచంలోని దేశాలన్ని.. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22వ తేదీన వరల్డ్ ఎర్త్ డే(World Earth Day) జరుపుకుంటారు. కాబట్టి ఈ రోజున పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత, అవసరం గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తారు.
రోజు రోజుకూ తీవ్రమవుతున్న ప్రపంచ వాతావరణ సంక్షోభంపై దృష్టి సారిస్తూ ఎర్త్డే చేస్తారు. అధిక జనాభా, జీవవైవిధ్యాన్ని కోల్పోవడం, ఓజోన్ పొర క్షీణించడం, పెరుగుతున్న కాలుష్యంతో సహా పెరుగుతున్న పర్యావరణ సమస్యలపై ఈ రోజు ప్రజలకు అవగాహన కల్పిస్తారు.
ఎర్త్ డేను మొదటిసారిగా ఏప్రిల్ 22, 1970న జరుపుకొన్నారు. 1969లో శాన్ఫ్రాన్సిస్కోలో జరిగిన UNSEO సమావేశంలో శాంతి కార్యకర్త జాన్ మెక్కానెల్ భూమి, శాంతి అనే భావనను ప్రతిపాదించాడు. ప్రపంచ ఎర్త్ డేని మొదట మార్చి 21, 1970న నిర్వహించాలని ప్రతిపాదించారు. తరువాత యునైటెడ్ స్టేట్స్ సెనేటర్ గేలార్డ్ నెల్సన్ ఏప్రిల్ 22, 1970న దేశవ్యాప్త పర్యావరణపై ఆందోళనను
ప్రేరేపించారు. ఆ రోజును ఎర్త్ డే అని పేరు పెట్టారు.
వాతావరణ మార్పుల కారణంగా భూమిపై ఇప్పటికే ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి. దీనితో అనేక ఇబ్బందులు వస్తున్నాయి. పర్యావరణ మార్పులతో అనుకోని సంఘటనలు జరుగుతాయి. ఎప్పుడూ వర్షాలు పడే ప్రాంతాల్లో కరువు వస్తుంది. అసలు వానలే లేని ప్రాంతంలో వరదలు వస్తుంటాయి. మనం చేస్తున్న తప్పులతో చాలా దేశాలలో నీటి సమస్యలు తలెత్తాయి. ఈ భూమిని మనిషి ఎంత స్వార్థంతో వినియోగిస్తాడో ప్రకృతి కూడా అంతే నష్టాన్ని తిరిగి కలిగిస్తుంది. ప్రకృతిని కాపాడుకుంటేనే సంతోషకరమైన జీవితం గడపడం సాధ్యమవుతుంది.
పర్యావరణానికి దగ్గరగా ఉండడం అంటే పర్యావరణాన్ని ప్రేమించడం. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి. సేంద్రియ పదార్థాలు వాడాలి. ప్లాస్టిక్ బాటిల్, ప్లాస్టిక్ బ్యాగ్ ఉపయోగించవద్దు. కార్లు, బైక్లకు బదులు సైకిళ్లను ఎక్కువగా వాడితే వాయు కాలుష్యం తగ్గుతుంది. ప్రతి మనిషి తన జీవితకాలంలో చెట్లను నాటాలి. ఇది మన తర్వాతి తరానికి మనం ఇచ్చే గొప్ప బహుమతి.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- దుబాయ్ లో సైకిళ్లు, స్కూటర్ల కోసం మల్టీయూజ్ ట్రాక్
- సౌత్ అల్ బతినా గవర్నరేట్లో అగ్నిప్రమాదం
- కింగ్ సల్మాన్ కు వైద్య పరీక్షలు
- నకిలీ వర్క్ పర్మిట్లు సేల్..ఇద్దరు అరెస్ట్
- మారిటైమ్ సేఫ్టీ నినాదంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- ఇరాన్ అధ్యక్షుడు రైసీహెలికాప్టర్ ప్రమాదంలో మృతి..!
- యూఏఈ ప్రయాణ వ్యాక్సిన్లు: అవసరమైన జాబ్లు, ఖర్చులు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..