గాల్లో ఢీకొన్నరెండు హెలీకాప్టర్లు..10 మంది మృతి
- April 23, 2024
కౌలాలంపూర్: మలేసియాలో మంగళవారం ఉదయం విషాదకర ఘటన జరిగింది. రాయల్ మలేషియన్ నేవీకి చెందిన రెండు హెలీకాప్టర్లు ప్రమాదవశాత్తూ గాల్లో ఢీకొట్టుకున్నాయి. రిహార్సల్ చేస్తున్న సమయంలో చోటుచేసుకున్న ఈ దుర్ఘటనలో మొత్తం 10 మంది మృత్యువాతపడ్డారని మలేసియా నేవీ అధికారికంగా ప్రకటించింది. పశ్చిమ రాష్ట్రం పెరాక్లోని లుముట్ నౌకాదళ స్థావరం వద్ద ఈ ప్రమాదం జరిగిందని, మంగళవారం ఉదయం 9.32 గంటలకు సమయం చోటుచేసుకుందని వివరించింది. రెండు హెలీకాప్టర్లలోని మొత్తం 10 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని వివరించింది. అందరూ అక్కడికక్కడే చనిపోయినట్లు నిర్ధారించింది.
ఈ ప్రమాదంలో అగస్టావెస్ట్ల్యాండ్ ఏడ్ల్యూ139 మెరిటైమ్ ఆపరేషన్ హెలికాప్టర్, యూరోకాప్టర్ ఫెన్నెక్ లైట్-సైజ్ కౌంటర్ హెలీకాప్టర్లు ఢీకొన్నాయని స్థానిక మీడియా ‘మలయ్ మెయిల్’ కథనం పేర్కొంది. గాల్లో ఢీకొన్నాక ఏడ్ల్యూ139 హెలీకాప్టర్ నేవీ బేస్కు చెందిన స్టేడియం మెట్లపై పడింది. మరో హెలీకాప్టర్ అదే బేస్లోని స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఉన్న స్విమ్మింగ్ పూల్లో పడిందని తెలిపింది. ఈ ఘటనపై మలేసియన్ నేవీ దర్యాప్తు ప్రారంభించింది. దర్యాప్తు ప్రక్రియ, మృతుల కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని వీడియోలను షేర్ చేయవద్దని అక్కడి ప్రజలను ప్రభుత్వం కోరింది.
తాజా వార్తలు
- BD50,000 తమ్కీన్-SIO ఫ్రాడ్.. ఐదుగురికి జైలు శిక్ష..!!
- బేస్మెంట్, అసురక్షిత పార్టిషన్ లపై ఫైర్ ఫోర్స్ హెచ్చరిక..!!
- ఒమన్ను హెచ్చరించిన ట్రంప్..!!
- ఖతార్ వ్యాప్తంగా ఈద్ వేడుకలు..!!
- సౌదీలో 10 మంది ఉల్లంఘనదారులకు భారీ జరిమానా..!!
- తప్పుడు లింక్పై క్లిక్.. సైబర్ సెక్యూరిటీ నిపుణుల హెచ్చరిక..!!
- దొంగిలించిన క్రెడిట్ కార్డుల కొనుగోలుపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు షాక్!
- ఎన్టీఆర్ ఘాట్ వద్ద తారక్, పురందేశ్వరి భావోద్వేగ నివాళులు
- న్యూఢిల్లీలో ‘అప్నాపన్’ పుస్తకావిష్కరణలో పాల్గొన్న వెంకయ్య నాయుడు









