కంటి శస్త్ర చికిత్స పరికరమును విరాళంగా ఇచ్చిన మజ్గూన్ డాక్ యార్డ్

- April 23, 2024 , by Maagulf
కంటి శస్త్ర చికిత్స పరికరమును విరాళంగా ఇచ్చిన మజ్గూన్ డాక్ యార్డ్

అమరావతి: సిద్ధ యోగి గురు రామ్ రతన్ జీ 74వ జన్మదినం పురస్కరించుకుని మచిలీపట్నం దగ్గర గూడురు గురు దత్తక్షేత్రం లో మూడు రోజులు అనగా ఏప్రిల్ 20,21,22 తేదీలలో శ్రీ సాయి అహోరాత్రి మహాయజ్ఞం జరిగింది.రామ్ రతన్ జీ మహారాజ్ చే స్థాపించబడిన కె.ఎస్.ఎం సాయి నేత్రాలయమునకు మజ్గూన్ డాక్ యార్డ్ లిమిటెడ్(కేంద్ర ప్రభత్వ సంస్థ)వారిచే 48లక్షల కంటి శస్త్ర చికిత్స పరికరమును కంటి ఆసుపత్రికి విరాళంగా ఇచ్చారు.మజ్గూన్ డాక్ యార్డ్ లిమిటెడ్ డైరెక్టర్ బి.మల్లికార్జున్ చే ప్రారంభించబడింది.ఈ కార్యక్రమములో రాజమాత శ్రీ విశుద్ధానంద భారతి మానసాదేవి చారిటబుల్ ట్రస్టీ గుడ్లవల్లేటి పవన్ కుమార్ మరియు సభ్యులు డి.అంకయ్య,డి.సాంబశివరావు,ఆర్.సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com