అమెరికాలో భారతీయ విద్యార్థులకు చేదు అనుభవం
- June 07, 2016
అమెరికాలో భారతీయ విద్యార్థులకు చేదు అనుభవం ఎదురైంది. వెస్ట్రన్ కెంటకీ యూనివర్సిటీ అడ్మిషన్ ఇచ్చాక వర్సిటీలో చేరిన 25 మంది విద్యార్థులను వెనక్కి వెళ్లిపొమ్మని చెప్పింది. యూనివర్శిటీలో కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్ మొదటి సెమిస్టర్ చదువుతున్న 25 మంది భారతీయ విద్యార్థులను అడ్మిషన్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు తిరిగి భారత్ వెళ్లండి.. లేదా మరో యూనివర్శిటీ చూసుకోండి అని చెప్పిందని న్యూయార్క్ టైమ్స్ పత్రిక వెల్లడించింది.యూనివర్శిటీ అడ్మిషన్ ప్రమాణాలను ఈ విద్యార్థులు చేరుకోవడం లేదని వర్శిటీ పేర్కొంది. ఈ ఏడాది జనవరిలో సుమారు 60 మంది భారతీయ విద్యార్థులు ఈ కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్లో చేరారు. వారిలో చాలా మంది యూనివర్శిటీ ప్రవేశానికి తగిన అర్హతలను చేరుకోవడం లేదని.. అయితే 35 మందికి మాత్రం కొనసాగడానికి అవకాశమిస్తామని అన్నారు. కానీ 25 మంది విద్యార్థులు మాత్రం కచ్చితంగా యూనివర్శిటీ నుంచి వెళ్లిపోవాలని వర్శిటీ అధికారులు వెల్లడించినట్లు పత్రిక పేర్కొంది. ఈ విద్యార్థులకు తమ కరిక్యులమ్లో తప్పనిసరి అయిన కంప్యూటర్ ప్రోగ్రామ్స్ రాసే నైపుణ్యం లేదని, అందుకే పంపిస్తున్నట్లు వర్శిటీ అధికారి జేమ్స్ గారీ తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యార్థుల సమస్య వెలుగులోకి రావడం చర్చనీయాంశమవుతోంది.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







