తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదల
- April 24, 2024
హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్ విద్యార్థులు గుడ్ న్యూస్..ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు వచ్చేసాయి. నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, బోర్డు కార్యదర్శి శృతి ఓజా ఇంటర్ ఫలితాలను వెల్లడించారు. ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్స్కు సంబంధించిన ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. మొత్తం 9,80,978 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. ఇందులో 4,78,527 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు ఉన్నారు.కాగా ఈ రోజు విడుదలైన ఫలితాల్లో ఇంటర్ ఫస్టియర్ 60.01 శాతం ఉత్తీర్ణత సాధించారు.
సెకండియర్ లో 64.19 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్సైట్లు అయిన https://tsbie.cgg.gov.in/, http://results.cgg.gov.inలో కూడా ఫలితాలను చూసుకోవచ్చు. వెబ్సైట్లో హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి ఫలితాలను తెలుసుకోవచ్చు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా మార్కుల మెమో సాఫ్ట్ కాపీని ప్రింట్ తీసుకోవచ్చు. తెలంగాణలో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా ఫస్ట్, సెకండ్ ఇయర్ విద్యార్థులు కలిపి 9,80,978 మంది పరీక్షలు రాశారు.
తాజా వార్తలు
- డోనాల్డ్ ట్రంప్ కొత్త స్కీమ్..
- జల వివాదాల పై రాష్ట్రాలకు ప్రధాని మోదీ కీలక సూచన
- ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’తో రాష్ట్రాల మధ్య సాంస్కృతిక బంధం బలోపేతం: గవర్నర్ శుక్లా
- గోదావరి-కావేరి అనుసంధానం పై కేంద్రం యోచన: సీఎం చంద్రబాబు
- ఎన్టీఆర్ స్ఫూర్తితో తెలంగాణ అభివృద్ధి: సీఎం రేవంత్
- BD50,000 తమ్కీన్-SIO ఫ్రాడ్.. ఐదుగురికి జైలు శిక్ష..!!
- బేస్మెంట్, అసురక్షిత పార్టిషన్ లపై ఫైర్ ఫోర్స్ హెచ్చరిక..!!
- ఒమన్ను హెచ్చరించిన ట్రంప్..!!
- ఖతార్ వ్యాప్తంగా ఈద్ వేడుకలు..!!
- సౌదీలో 10 మంది ఉల్లంఘనదారులకు భారీ జరిమానా..!!









