ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- April 24, 2024హైదరాబాద్: ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు జరిగాయని సాట్ చైర్మన్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనా రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఐపీఎల్ టికెట్లను బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నదని ఆయన అన్నారు.
అక్షర స్కూల్ యాజమాన్యం టికెట్లకు అక్రమంగా అమ్మకాలు చేస్తుందని ఆరోపించారు. క్రికెట్ అభిమానులను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తీవ్ర నిరాశలకు గురి చేసిందన్నారు.
హెచ్సీఏ వైఖరి నిరసిస్తూ గురువారం (ఏప్రిల్ 25) ఉప్పల్ క్రికెట్ స్టేడియాన్ని ముట్టడిస్తామని శివసేనా రెడ్డి పిలుపునిచ్చారు. సాట్ చైర్మన్ పిలుపు మేరకు రేపు ఉదయం 10 గంటలకు ఉప్పల్ స్టేడియంను యూత్ కాంగ్రెస్ ముట్టడించనుంది.
ఉదయం 10 గంటలకు శివసేన రెడ్డి ఉప్పల్ స్టేడియం చేరుకోనున్నారు. కాంగ్రెస్ అభిమానులతో పాటు యూత్ కాంగ్రెస్ భారీగా ఉప్పల్ స్టేడియం వద్దకు తరలిరావాలని శివసేనరెడ్డి పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ