ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- April 24, 2024
హైదరాబాద్: ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు జరిగాయని సాట్ చైర్మన్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనా రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఐపీఎల్ టికెట్లను బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నదని ఆయన అన్నారు.
అక్షర స్కూల్ యాజమాన్యం టికెట్లకు అక్రమంగా అమ్మకాలు చేస్తుందని ఆరోపించారు. క్రికెట్ అభిమానులను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తీవ్ర నిరాశలకు గురి చేసిందన్నారు.
హెచ్సీఏ వైఖరి నిరసిస్తూ గురువారం (ఏప్రిల్ 25) ఉప్పల్ క్రికెట్ స్టేడియాన్ని ముట్టడిస్తామని శివసేనా రెడ్డి పిలుపునిచ్చారు. సాట్ చైర్మన్ పిలుపు మేరకు రేపు ఉదయం 10 గంటలకు ఉప్పల్ స్టేడియంను యూత్ కాంగ్రెస్ ముట్టడించనుంది.
ఉదయం 10 గంటలకు శివసేన రెడ్డి ఉప్పల్ స్టేడియం చేరుకోనున్నారు. కాంగ్రెస్ అభిమానులతో పాటు యూత్ కాంగ్రెస్ భారీగా ఉప్పల్ స్టేడియం వద్దకు తరలిరావాలని శివసేనరెడ్డి పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు