తెలంగాణ రాష్ట్రంలో వేర్వేరు రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి
- April 25, 2024
హైదరాబాద్: భారత దేశ వ్యాప్తంగా ప్రతి రోజు రోడ్డు ప్రమాదాలు అనేవి అనేకం జరుగుతున్నాయి. ఈ రోడ్డు ప్రమాదాల వల్ల ఎంతోమంది కన్నుమూస్తున్నారు. తాజాగా తెలంగాణ లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో 10 మంది యువకులు కన్నుమూశారు.
హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న కారు సూర్యపేట జిల్లా కోదాడ సమీపంలో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. విజయవాడ వెళ్తున్న కారు ఆగి ఉన్న లారీని బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయింది. డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నందునే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
మరో ప్రమాదం వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో జరిగింది. నలుగురు ఇంటర్ విద్యార్థులు ఒకే బైక్పై ఇల్లందు నుంచి వర్ధన్నపేట వెళ్తుండగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. వీరి మరణంతో వీరి కుటుంబాల్లో విషాదం నెలకొంది.
తాజా వార్తలు
- ఒమన్ తీవ్రమైన వేడి.. 48°Cకు ఉష్ణోగ్రతలు..!!
- క్యజో రి శిఖరాన్ని అధిరోహించిన యువ బహ్రెయిన్ సాహసికుడు..!!
- అల్ జౌర్ బీచ్లో షార్క్ దాడిలో 11 ఏళ్ల బాలికకు గాయాలు..!!
- అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన..ప్రత్యేకంగా సౌదీ పెవిలియన్..!!
- Q1లో స్థిరంగా ఖతార్ రిటైల్ రియల్ ఎస్టేట్ మార్కెట్..!!
- దుబాయ్లో జూన్ 1నుంచి సాలిక్ వ్యాట్ నిబంధన..!!
- తిరుమలకు రూ.1.13 కోట్ల ఎలక్ట్రిక్ బస్సు విరాళం
- విద్యార్థుల సురక్షిత రవాణాకు సరికొత్త ప్రణాళిక: సైబరాబాద్ సీపీ రమేష్
- భారత్ లో ఇక ప్లాస్టిక్ కరెన్సీ!
- కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ వరకు..ఉదయ్ కృష్ణారెడ్డి స్ఫూర్తిదాయక విజయం









