తెలంగాణ రాష్ట్రంలో వేర్వేరు రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి

- April 25, 2024 , by Maagulf
తెలంగాణ రాష్ట్రంలో వేర్వేరు రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి

హైదరాబాద్: భారత దేశ వ్యాప్తంగా ప్రతి రోజు రోడ్డు ప్రమాదాలు అనేవి అనేకం జరుగుతున్నాయి. ఈ రోడ్డు ప్రమాదాల వల్ల ఎంతోమంది కన్నుమూస్తున్నారు. తాజాగా తెలంగాణ లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో 10 మంది యువకులు కన్నుమూశారు.

హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న కారు సూర్యపేట జిల్లా కోదాడ సమీపంలో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. విజయవాడ వెళ్తున్న కారు ఆగి ఉన్న లారీని బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయింది. డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నందునే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

మరో ప్రమాదం వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో జరిగింది. నలుగురు ఇంటర్ విద్యార్థులు ఒకే బైక్‌పై ఇల్లందు నుంచి వర్ధన్నపేట వెళ్తుండగా ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సు ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. వీరి మరణంతో వీరి కుటుంబాల్లో విషాదం నెలకొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com