తెలంగాణ రాష్ట్రంలో వేర్వేరు రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి
- April 25, 2024
హైదరాబాద్: భారత దేశ వ్యాప్తంగా ప్రతి రోజు రోడ్డు ప్రమాదాలు అనేవి అనేకం జరుగుతున్నాయి. ఈ రోడ్డు ప్రమాదాల వల్ల ఎంతోమంది కన్నుమూస్తున్నారు. తాజాగా తెలంగాణ లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో 10 మంది యువకులు కన్నుమూశారు.
హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న కారు సూర్యపేట జిల్లా కోదాడ సమీపంలో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. విజయవాడ వెళ్తున్న కారు ఆగి ఉన్న లారీని బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయింది. డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నందునే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
మరో ప్రమాదం వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో జరిగింది. నలుగురు ఇంటర్ విద్యార్థులు ఒకే బైక్పై ఇల్లందు నుంచి వర్ధన్నపేట వెళ్తుండగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. వీరి మరణంతో వీరి కుటుంబాల్లో విషాదం నెలకొంది.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









