మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- April 25, 2024
రియాద్: మే 14, 15 తేదీల్లో "గ్రేట్ ఫ్యూచర్స్" వాణిజ్య ప్రదర్శనను రియాద్ వేదికగా నిర్వహించనున్నారు. సౌదీ అరేబియా, యునైటెడ్ కింగ్డమ్ ప్రభుత్వాలు ఈ ఎక్స్పోను నిర్వహిస్తున్నాయి. ఇది వ్యాపారం, పర్యాటకం మరియు సాంస్కృతిక రంగాలలో భాగస్వామ్యాన్ని పెంచనుంది. బ్రిటీష్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఒలివర్ డౌడెన్ 350 మంది బ్రిటీష్ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తారు. రియాద్లోని కింగ్ అబ్దుల్లా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో జరిగే రెండు రోజుల ఫ్లాగ్షిప్ ఈవెంట్లో దాదాపు 750 మంది ప్రతినిధులు పాల్గొంటారు. బ్రిటిష్ ప్రతినిధి బృందంలో 350 మందికి పైగా ప్రభుత్వ అధికారులు, బ్రిటిష్ వ్యాపార రంగానికి చెందిన ప్రముఖ వ్యక్తులు ఉంటారు. సౌదీ-బ్రిటీష్ వ్యూహాత్మక భాగస్వామ్య మండలి ప్రయత్నాలలో భాగంగా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను పెంపొందించడంతో పాటు అనేక ఆశాజనక రంగాలలో ఇరుపక్షాల మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసే లక్ష్యంతో ఈ ట్రేడ్ ఫెయిర్ నిర్వహిస్తున్నట్లు వాణిజ్య మంత్రి డాక్టర్ మజేద్ అల్-కసాబీ తెలిపారు.
తాజా వార్తలు
- త్వరలో వెబ్లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!







