మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్‌పో

- April 25, 2024 , by Maagulf
మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్‌పో

రియాద్: మే 14, 15 తేదీల్లో "గ్రేట్ ఫ్యూచర్స్" వాణిజ్య ప్రదర్శనను రియాద్  వేదికగా నిర్వహించనున్నారు. సౌదీ అరేబియా, యునైటెడ్ కింగ్‌డమ్ ప్రభుత్వాలు ఈ ఎక్స్‌పోను నిర్వహిస్తున్నాయి.  ఇది వ్యాపారం, పర్యాటకం మరియు సాంస్కృతిక రంగాలలో భాగస్వామ్యాన్ని పెంచనుంది.  బ్రిటీష్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఒలివర్ డౌడెన్ 350 మంది బ్రిటీష్ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తారు.  రియాద్‌లోని కింగ్ అబ్దుల్లా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో జరిగే రెండు రోజుల ఫ్లాగ్‌షిప్ ఈవెంట్‌లో దాదాపు 750 మంది ప్రతినిధులు పాల్గొంటారు. బ్రిటిష్ ప్రతినిధి బృందంలో 350 మందికి పైగా ప్రభుత్వ అధికారులు, బ్రిటిష్ వ్యాపార రంగానికి చెందిన ప్రముఖ వ్యక్తులు ఉంటారు. సౌదీ-బ్రిటీష్ వ్యూహాత్మక భాగస్వామ్య మండలి ప్రయత్నాలలో భాగంగా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం,  పెట్టుబడులను పెంపొందించడంతో పాటు అనేక ఆశాజనక రంగాలలో ఇరుపక్షాల మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసే లక్ష్యంతో ఈ ట్రేడ్ ఫెయిర్ నిర్వహిస్తున్నట్లు వాణిజ్య మంత్రి డాక్టర్ మజేద్ అల్-కసాబీ తెలిపారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com