కాలువల్లో చనిపోయిన చేపలు.. మున్సిపాలిటీ క్లారిటీ
- April 27, 2024దుబాయ్: కొన్ని నీటి కాలువల్లో చనిపోయిన చేపలు కనిపించడంపై.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలపై దుబాయ్ మున్సిపాలిటీ స్పందించింది. కుండపోత వర్షం, వరదల తర్వాత నీటి కాలువల్లో చనిపోయిన చేపలు కనిపించడం సహజమైన విషయమని దుబాయ్ మునిసిపాలిటీ (డీఎం) స్పష్టం చేసింది. ఎమిరేట్లోని ఫుట్ పాత్, వాటర్ చానల్స్ లలో చనిపోయిన చేపలు ఉన్నాయని అనేక మీడియా మరియు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. తరచుగా వాతావరణ పరిస్థితులలో మార్పుల వల్ల ఇలా అవుతుందని తెలిపారు. అధిక వర్షపాతం పెరగడం లేదా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం వంటివి వీటికి కారణం అని ఒక ప్రతినిధి చెప్పారు. పరిస్థితిని నిర్వహించేందుకు ప్రత్యేక బృందాలు ప్రస్తుతం పనిచేస్తున్నాయని తెలిపారు. యూఏఈ లో ఏప్రిల్ 16న అత్యధిక వర్షపాతం నమోదైంది. అధికారుల ప్రకారం.. దుబాయ్లో 24 గంటల కంటే తక్కువ సమయంలో 220 మిమీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది.
తాజా వార్తలు
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం
- రాజు సల్మాన్కు లంగ్ ఇన్ఫెక్షన్
- మద్యం పాలసీ కేసు..కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు