ఏపీలో ఎన్నికల పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- April 29, 2024
హైదరాబాద్: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సమరం నడుస్తుంది. ఈ క్రమంలో దేశ ప్రజలంతా ఎన్నికల ఫలితాల గురించే మాట్లాడుకుంటున్నారు. కాకపోతే ఏపీ ఎన్నికల గురించి కాస్త ఎక్కువగా ఆరా తీస్తున్నారు. ఈసారి ఏపీలో ఏ పార్టీ విజయం సాదించబోతుందని..ఎవరు విజేత అవుతారని..ఏ పార్టీ కి ఎన్ని సీట్లు వస్తాయని భావిస్తున్నారు..? అంటూ చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ..ఏపీ ఎన్నికల ఫై స్పందించారు.
ఏపీలో జగన్ గెలవబోతున్నట్లు తమకు సమాచారముందని కేసీఆర్, కేటీఆర్లు అంటున్నారు. దీనిపై మీ సమాధానం..అని ప్రశ్నించగా..ఎక్కడైనా ప్రస్తుతం కొనసాగుతున్న ప్రభుత్వాలపై వ్యతిరేకత ఉంది. వాళ్లు చెప్పిన మాట నిలబెట్టుకోనందువల్ల ప్రతికూల వాతావరణం ఉంది. మేం షర్మిల నాయకత్వంలో అక్కడ కాంగ్రెస్ ఇన్నింగ్స్ ప్రారంభించాం. ఎన్ని సీట్లను గెలిపించుకోగలం? షర్మిల ప్రశ్నించే గొంతుకగా ప్రజా సమస్యలపై ఎలా కొట్లాడుతున్నారు? ఆమెకు ఎలా మద్దతుగా నిలబడాలి? అనేదే మా ప్రణాళిక. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలనేదే మా రాజకీయ ప్రణాళిక. ఈసారి అక్కడ అన్ని సీట్లలో పోటీకి దిగాం. మా దృష్టంతా కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన ఎన్నికల వాతావరణాన్ని సృష్టించడంపైనే. మొదటి నుండి జగన్ విషయంలో కేసీఆర్ కు సానుకూలంగా ఉంటూ వస్తున్నారు. ప్రతి విషయంలో జగన్ కు సపోర్ట్ ఇస్తూ వస్తున్నారు. అందుకే ఆయన సీఎం జగన్ గెలిచే అవకాశాలు ఉన్నాయని తెలిపినట్లు ఉందంటూ రేవంత్ చెప్పుకొచ్చారు.
తాజా వార్తలు
- రాజీవ్ గాంధీ స్ఫూర్తితో తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు: సీఎం రేవంత్ రెడ్డి
- తమిళనాడులో విజయ్ క్యాబినెట్ విస్తరణ..21మంది టీవీకే, ఇద్దరు కాంగ్రెస్..
- ‘కాక్రోచ్ జనతా పార్టీ’.. అసలు ఎలా ప్రారంభమైంది?
- పదేళ్లలో 100 కొత్త ఎయిర్పోర్టులు: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
- ఈద్ అల్ అధా సందర్భంగా 230 మంది ఖైదీలకు అజ్మాన్ రూలర్ క్షమాభిక్ష
- బాల్య వివాహాలను ప్రేరేపించినందుకు జైలు శిక్ష, Dh5 మిలియన్ల జరిమానా..!!
- గుండెపోటు.. నలుగురు హజ్ యాత్రికులు రక్షించిన వైద్య బృందాలు..!!
- యూఏఈ లాటరీ డ్రా..విజేత IDలు ఇవే..!!
- మానవ అక్రమ రవాణా కేసులో ఆసియా మహిళకు ఐదేళ్ల జైలు శిక్ష..!!
- ఈద్ అల్ అధాకు భారతీయ మేకలకు డిమాండ్..!!









