సైబర్ మోసాలకు చెక్.. వింగో యాప్ క్లోజ్!
- February 05, 2026
భారత దేశంలోని మొబైల్ వినియోగదారుల భద్రతే లక్ష్యంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్ గేమింగ్ ముసుగులో వినియోగదారుల ఫోన్లను హ్యాక్ చేసి, స్కామ్ మెసేజ్లు పంపుతున్న ‘వింగో’ (Wingo) యాప్ను భారత ప్రభుత్వం నిషేధించింది.
భారత సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) జరిపిన లోతైన విచారణలో ‘వింగో’ గేమింగ్ యాప్ అసలు రంగు బయటపడింది. ఈ యాప్ వినియోగదారుల మొబైల్ ఫోన్లను తమ ఆధీనంలోకి తీసుకుని, బాధితులకు కనీసం అనుమానం కూడా రాకుండా వారి ఫోన్ల ద్వారా ఇతరులకు మోసపూరిత సందేశాలను (Scam Messages) పంపుతున్నట్లు అధికారులు గుర్తించారు.
ఈ భారీ సైబర్ నెట్వర్క్ను మరియు డేటా చోరీని అరికట్టేందుకు ఐ4సీ తక్షణమే స్పందించి వింగో యాప్కు సంబంధించిన సర్వర్లను పూర్తిగా బ్లాక్ చేసింది. ఈ నేపథ్యంలో, ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ వినియోగదారులు ఎవరూ కూడా ఈ ప్రమాదకరమైన యాప్ను ఇన్స్టాల్ చేయవద్దని అధికారులు స్పష్టం చేశారు. ఒకవేళ ఇప్పటికే ఎవరి ఫోన్లలోనైనా ఈ యాప్ ఉంటే, భద్రతా కారణాల దృష్ట్యా వెంటనే దాన్ని తొలగించాలని హోం మంత్రిత్వ శాఖ తీవ్రంగా హెచ్చరించింది.
తాజా వార్తలు
- సందర్శకులకు కీలక సూచనలు చేసిన దుబాయ్ మాల్..!!
- హజ్ యాత్రికులకు కువైట్ కీలక సూచనలు..!!
- బహ్రెయిన్ లో దోమల నివారణ.. ప్రజలకు కీలక పిలుపు..!!
- తల్లులు మరియు శిశువులను రక్షించడానికి RSV వ్యాక్సిన్..!!
- హోర్ముజ్ జలసంధి భద్రతపై ఒమన్, ఇరాన్ చర్చలు..!!
- 2026 హజ్ యాత్రను విజయవంతంగా ముగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్లో ఘనంగా ఎన్టీఆర్ 104వ జయంతి, టీడీపీ మహానాడు వేడుకలు
- భారత దేశవ్యాప్తంగా ఒకే హెల్ప్లైన్ నెంబర్..సుప్రీం ఆదేశం
- ఏపీలో రాబోయే మూడు రోజుల పాటు వర్ష సూచన
- సంక్షేమ పథకాల్లో డిజిటల్ కరెన్సీ..RBI కీలక యోచన









