బొగ్గు గనిలో పేలుడు 10 మంది మృతి మేఘాలయలో విషాదం!
- February 05, 2026
మేఘాలయ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. తాష్ఖై ప్రాంతంలోని ఓ బొగ్గు గనిలో గురువారం తెల్లవారుజామున భారీ పేలుడు సంభవించడంతో కనీసం 10 మంది కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఒక్కసారిగా పేలుడు చోటుచేసుకోవడంతో గనిలో పని చేస్తున్న కార్మికులు బయటపడే అవకాశం లేక ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.
మృతుల్లో ఎక్కువ మంది అస్సాం రాష్ట్రానికి చెందిన వలస కార్మికులుగా గుర్తిస్తున్నారు. ఒకరి వివరాలు ఇప్పటికే తెలిసినప్పటికీ, మిగతా వారి గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గనిలో చిక్కుకున్న మరికొందరిని రక్షించేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
ఇటీవల మేఘాలయలో చట్టవిరుద్ధంగా జరుగుతున్న ‘రాట్-హోల్ మైనింగ్’ కారణంగా ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు ప్రారంభించామని, బాధ్యుల పై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







