బొగ్గు గనిలో పేలుడు 10 మంది మృతి మేఘాలయలో విషాదం!
- February 05, 2026
మేఘాలయ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. తాష్ఖై ప్రాంతంలోని ఓ బొగ్గు గనిలో గురువారం తెల్లవారుజామున భారీ పేలుడు సంభవించడంతో కనీసం 10 మంది కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఒక్కసారిగా పేలుడు చోటుచేసుకోవడంతో గనిలో పని చేస్తున్న కార్మికులు బయటపడే అవకాశం లేక ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.
మృతుల్లో ఎక్కువ మంది అస్సాం రాష్ట్రానికి చెందిన వలస కార్మికులుగా గుర్తిస్తున్నారు. ఒకరి వివరాలు ఇప్పటికే తెలిసినప్పటికీ, మిగతా వారి గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గనిలో చిక్కుకున్న మరికొందరిని రక్షించేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
ఇటీవల మేఘాలయలో చట్టవిరుద్ధంగా జరుగుతున్న ‘రాట్-హోల్ మైనింగ్’ కారణంగా ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు ప్రారంభించామని, బాధ్యుల పై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- సోషల్ మీడియాకు KYC తప్పనిసరి..
- ఏపీ ప్రజలకు హెచ్చరిక..3 నెలలు తీవ్రమైన ఎండలు, వడగాలులు..
- లేపాక్షి రాయితీ అమ్మకాలకు విశేష స్పందన
- ఆయుష్మాన్ భారత్..రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స...
- వైజాగ్ ఆర్కే బీచ్లో కేఎఫ్సీ..ఇసుకతో భారీ ‘బకెట్’ ఆవిష్కరణ!
- మహిళా రిజర్వేషన్ల బిల్లులో ఓబీసీ సబ్ కోటా తప్పనిసరి: కల్వకుంట్ల కవిత
- యురేనియం నిల్వల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- ఇరాన్కు అమెరికా పలు కీలక ప్రతిపాదనలు..అందులో ఏమున్నాయంటే?
- ఈయూ పార్లమెంట్ అధ్యక్షురాలితో జీసీసీ రాయబారులు భేటీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్ళు..హెచ్చరికలు జారీ..!!









