బొగ్గు గనిలో పేలుడు 10 మంది మృతి మేఘాలయలో విషాదం!
- February 05, 2026
మేఘాలయ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. తాష్ఖై ప్రాంతంలోని ఓ బొగ్గు గనిలో గురువారం తెల్లవారుజామున భారీ పేలుడు సంభవించడంతో కనీసం 10 మంది కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఒక్కసారిగా పేలుడు చోటుచేసుకోవడంతో గనిలో పని చేస్తున్న కార్మికులు బయటపడే అవకాశం లేక ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.
మృతుల్లో ఎక్కువ మంది అస్సాం రాష్ట్రానికి చెందిన వలస కార్మికులుగా గుర్తిస్తున్నారు. ఒకరి వివరాలు ఇప్పటికే తెలిసినప్పటికీ, మిగతా వారి గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గనిలో చిక్కుకున్న మరికొందరిని రక్షించేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
ఇటీవల మేఘాలయలో చట్టవిరుద్ధంగా జరుగుతున్న ‘రాట్-హోల్ మైనింగ్’ కారణంగా ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు ప్రారంభించామని, బాధ్యుల పై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు.. ప్రజలకు అధికారుల కీలక సూచనలు
- ఇరాన్ దాడులు, హోర్ముజ్ జలసంధి భద్రత పై చర్చించిన బహ్రెయిన్ రాజు–ఈజిప్ట్ అధ్యక్షుడు
- సురక్షిత సమాజం కోసం మహిళలతో చేతులు కలిపిన మల్కాజిగిరి పోలీసులు
- దుబాయ్ పోలీస్లో నాలుగో విడత 'సేఫ్టీ అంబాసిడర్స్' కార్యక్రమం ప్రారంభం
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడి యత్నం.. శత్రు దాడులను తిప్పికొట్టిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్కు గూఢచర్యం చేసిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన బహ్రెయిన్
- ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక భేటీ...
- లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కువైట్ తొలి 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ
- ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్..
- ముద్రగడ పద్మనాభం కన్నుమూత







