జనసేన గాజు గ్లాస్ గుర్తుపై మరింత గందరగోళం - హైకోర్టుకు ఈసీ ఏం చెప్పిందంటే?

- May 01, 2024 , by Maagulf
జనసేన గాజు గ్లాస్ గుర్తుపై మరింత గందరగోళం - హైకోర్టుకు ఈసీ ఏం చెప్పిందంటే?

స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించడంపై జనసేన హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

దీనిపై బుధవారం విచారణ సందర్భంగా ఎన్నికల సంఘం హైకోర్టుకు వివరణ ఇచ్చింది. జనసేన పోటీ చేసే 21 అసెంబ్లీ స్థానాల్లో ఎంపీ అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించబోమని ఎన్నికల సంఘం న్యాయస్థానానికి తెలిపింది. అలాగే, 2 లోక్ సభ స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులకు సైతం గాజు గ్లాస్ గుర్తు కేటాయించబోమని స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com