శ్రామికుల దినోత్సవం
- May 01, 2024కార్మికోద్యమాల విజయానికి ప్రతీకగా మేడే లేదా అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం ప్రపంచమంతటా భాసిల్లుతూనే ఉంది. ఈ కార్మిక దినోత్సవం ఏ ఒక్క ప్రాంతానికో, దేశానికో, సంఘటనకో పరిమితం కాలేదు. శ్రమదోపిడిని(Exploitation) నిరసిస్తూ ప్రపంచవ్యాప్త కార్మికుల్లో స్పూర్తిని రగిలించిన తొలి అడుగే ‘మే డే’.
ప్రపంచ వ్యాప్తంగా మే 1వ తేదీని కార్మిక దినోత్సవంగా జరుపుకుంటారు.1886 మే 4న షికాగోలోని హే మార్కెట్లో కార్మిక సంఘాల సభలో పోలీసు కాల్పులు జరిగాయి. ఆ ఘటనలో మరణించిన కార్మికుల బలిదానాన్ని స్మరిస్తూ వారి పోరాట పటిమకు ప్రతి ఏడాది మే 1న నివాళులర్పించాలని 1889లో అంతర్జాతీయ సోషలిస్టు సమాఖ్య నిర్ణయించింది. నాటి నుండి మే 1ని కార్మిక దినోత్సవంగా జరపడం ప్రారంభమయ్యింది. భారత ఉపఖండంలో తొలిసారిగా 1923 మే నెల మొదటి రోజున మద్రాస్లో అరుణ పతాకం రెపరెపలాడింది.
1980 తర్వాత చోటుచేసుకున్న ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ (ఎల్పీజీ) పరిణామాల వల్ల అసంఘటిత కార్మికవర్గాల కార్మిక చట్టాలు అమలుకు నోచుకోవడంలేదు.ఎంతో మంది శ్రామికుల చేతులు కలవకుండా ఏ పారిశ్రామికవేత్త విజయం సాధించలేడు. ప్రతి పారిశ్రామికవేత్త విజయం వెనుక వేల మంది ఉద్యోగులు/కార్మికుల కృషి ఉంటుంది. మే డే జరుపుకునేందుకు ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. ఆ రోజున కార్మికులు వారి హక్కులను గుర్తు చేసుకోవడం, సమాజానికి వారు చేసిన సేవలకు గాను తగిన గుర్తింపు ఇచ్చి వారిని సన్మానించడం.
శ్రామికులు లేని దేశం.. దేశమే కాదు. శ్రామికులను తప్పకుండా గౌరవించుకోవాలి. వారిని అగౌరవపరచకూడదు. ఎందుకుంటే జీవితంలో మెట్టు ఎక్కేందుకు ఎందరో శ్రామికులు చేయి వేస్తారు. అప్పుడే ముందుకు సాగగలరు. అలాంటి వారిని తప్పుకుండా గౌరవించుకోవడం అందరి బాధ్యత !
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం
- రాజు సల్మాన్కు లంగ్ ఇన్ఫెక్షన్
- మద్యం పాలసీ కేసు..కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు