‘హరి హరవీరమల్లు’.! వేర్ ఈజ్ క్రిష్.!
- May 01, 2024
క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘హరి హరవీరమల్లు’. ఈ సినిమా మొగలుల కాల నాటి పీరియాడికల్ బ్యాక్ డ్రాప్గా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. మొగల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్రలో బాబీ డియోల్ నటిస్తున్నాడు.
పవన్ కళ్యాణ్ హీరోగా ఈ సినిమాని ఎప్పుడో స్టార్ట్ చేశాడు క్రిష్ జాగర్లమూడి. సినిమాకి సంబంధించి కొంత మేర ప్రమోషన్లు కూడా నిర్వహించాడు క్రిష్, పవన్ కళ్యాణ్తో కలిసి.
అయితే, అనూహ్యంగా క్రిష్కీ, పవన్ కళ్యాణ్కీ, అలాగే నిర్మాణ సంస్థకీ క్రిష్కీ కూడా ఏదో కిరికిరి రావడంతో ఈ సినిమాని మధ్యలోనే ఆపేశారన్న ప్రచారం జరిగింది.
అయితే తాజాగా ఈ సినిమా నుంచి అప్డేట్ వదలబోతున్నారు. ఇదెలా సాధ్యం అంటే.. ఏమో తెలీదు కానీ, ‘ధర్మం కోసం చేసే యుద్ధం..’ అంటూ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయబోతున్నారు. ఆల్రెడీ రిలీజైన గ్లింప్స్కి మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.
ఇక, రేపు అనగా మే 2న రిలీజ్ చేయబోయే ఫస్ట్ సింగిల్ ముచ్చట ఎలా వుండబోతోందో పవన్ ఫ్యాన్స్లో ఏ మేర ఉత్సాహం నింపబోతోందో అనే విషయం పక్కన పెడితే, ఈ అప్డేట్ అనౌన్స్ చేసిన పోస్టర్పై దర్శకుడు క్రిష్ పేరు కనిపించకపోవడమే ఇప్పుడు హాట్ టాపిక్.
దర్శకుడు మారాడా.? మారతాడా.? అసలు క్రిష్ ముచ్చటేందీ.? అనే విషయాలు తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్..
- సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు.. ఘనస్వాగతం పలికిన తెలుగు ప్రజలు
- ఫ్రాన్స్ అధ్యక్షుడి తో ప్రధాని మోడీ సమావేశం
- డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాల పై అవగాహన అవసరం: డా.జి.దీప
- అబుదాబిలో ఘనంగా 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!









