25 రైల్వేస్టేషన్లలో వేడిపాలు, వేడినీళ్లు, శిశువులకు..
- June 08, 2016
ప్రయాణంలో శిశువులకు, బాలింతలకు ఉపయోగపడేలా రైల్వేశాఖ సరికొత్త సేవను అందుబాటులోకి తెచ్చింది. 'జననీ సేవ'గా నామకరణం చేసిన ఈ సేవను రైల్వేశాఖ మంత్రి సురేశ్ ప్రభు బుధవారం ప్రారంభించారు. దీనిలో భాగంగా 25 రైల్వేస్టేషన్లలో వేడిపాలు, వేడినీళ్లు, శిశువులకు అవసరమయ్యే వస్తువులను అందుబాటులో ఉంచారు. దీంతో పాటు 5-12 ఏళ్ల వయసున్న చిన్నారులకు ప్రత్యేక ఆహార మెనూ రూపొందించారు.
ఈ సందర్భంగా కేంద్రమంత్రి సురేశ్ ప్రభు మాట్లాడుతూ... శిశువుకు పాలు దొరకడం లేదని ఓ బాలింత తనకు ట్వీట్ చేసిందని... దీంతో తాను స్పందించి శిశువుకు వెంటనే పాలు అందేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
ఇలాంటి పరిస్థితులు చాలామంది తల్లులు ఎదుర్కొంటున్నారని... అందువల్ల వారందరికీ ప్రయోజనకారిగా ఉండేందుకే 'జననీ సేవ'ను ప్రారంభించినట్లు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- తెలంగాణలో మార్పు మొదలైంది: కేటీఆర్
- ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మహిళా కమిషన్ విచారణలో శివాజీ క్షమాపణలు
- బ్యాంక్ సెలవుల జాబితా విడుదల
- చైనా: ప్రపంచంలోనే అతిపొడవైన టన్నెల్
- మనమా-దియార్ అల్ ముహారక్ మధ్య కొత్త బ్రిడ్జి..!!
- ఉగ్రవాదుల బాంబు దాడిని ఖండించిన ఖతార్..!!
- ప్రవాస కార్మికుల ఫుడ్ స్క్రీనింగ్ కేంద్రాలలో తనిఖీలు..!!
- ఫుడ్ ట్రక్ స్టార్టప్లకు మద్దతుగా మసార్ ప్రారంభం..!!
- కత్తితో దాడి..6 మందికి జైలు శిక్ష, బహిష్కరణ వేటు..!!







