అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని జిల్లాలను విభజించాలి : కేసీఆర్
- June 08, 2016
నూతన జిల్లా కేంద్రాలను అభివృద్ధికి కేంద్రాలుగా తీర్చిదిద్దాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కలెక్టర్లకు స్పష్టం చేశారు. పూర్తి స్వేచ్ఛాయుత వాతావరణంలో మండలాలు, జిల్లాల విభజన జరగాలన్నారు. హైదరాబాద్లోకలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో కొత్త జిల్లాలు, మండలాలఏర్పాటుపై సీఎం కసరత్తుచేశారు.ప్రస్తుతనియోజకవర్గాలు కాకుండా భవిష్యత్ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని జిల్లాలనువిభజించాలనిసూచించారు.మండలాలు, జిల్లాల ఏర్పాటుపై ప్రజల మనోభావాలు, భౌగోళిక పరిస్థితులను అధ్యయనం చేయాలని, అవసరమైతే గ్రామసభలు నిర్వహించి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని ఆదేశించారు.నూతన మండల వ్యవస్థను అభివృద్ధికి అనుకూలంగా తీర్చిదిద్దాలన్నారు.అవినీతిని సహించొద్దు కిందిస్థాయి ఉద్యోగుల అవినీతిని తీవ్రంగా పరిగణించాలని కలెక్టర్లకు ముఖ్యమంత్రి ఆదేశించారు. అధికారులు, ఉద్యోగుల్లో నెలకొన్న అవినీతిని రూపుమాపాలన్నారు. సాదా బైనామాలు, రిజిస్ట్రేషన్ల విషయంలో ఎలాంటి ఒత్తిడికి లోనుకావొద్దని సూచించారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







