క్యాబిన్ క్రూ సంక్షోభం.. తగ్గనున్న ఎయిర్ ఇండియా సర్వీసులు..!
- May 09, 2024
యూఏఈ: క్యాబిన్ సిబ్బంది సంక్షోభం కారణంగా 90 కంటే ఎక్కువ అంతర్జాతీయ మరియు దేశీయ విమానాలు ఆలస్యం కావడం, రద్దు చేయడం జరిగింది.ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO), అలోకే సింగ్ స్పందిస్తూ.. రాబోయే రోజుల్లో విమానయాన కార్యకలాపాలను తగ్గించనున్నట్లు బుధవారం ప్రకటించారు.
"నిన్న సాయంత్రం నుండి, మా క్యాబిన్ సిబ్బందిలో 100 మంది సహోద్యోగులు తమ రోస్టర్డ్ ఫ్లైట్ డ్యూటీకి ముందు అనారోగ్యంతో ఉన్నారని, చివరి నిమిషంలో తమ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగించారని నివేదించారు. ఈ చర్య ఎక్కువగా L1 పాత్రను కేటాయించిన సహోద్యోగులు చేసినందున, ప్రభావం అధికంగా ఉందన్నారు.
మరోవైపుఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాల రద్దు లేదా ఆలస్యం కారణంగా యూఏఈ నుండి వందలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విమానాల రద్దు వార్త వ్యాప్తి చెందడంతో, ఇతర విమానయాన సంస్థల టిక్కెట్ ధరలు భారీగా పెంచాయి. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాల రద్దుపై భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ స్పందించింది. దీనికి సంబంధించి వివరణ కోరింది. సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంస్థకు సలహా ఇచ్చింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ప్రమాణం ప్రకారం ప్రయాణీకులకు సౌకర్యాలు కల్పించాలని ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్కు సూచించింది.
తాజా వార్తలు
- ఐరా ‘స్పా’ మసాజ్ సెంటర్ లో వ్యభిచారం.. నలుగురు అరెస్ట్!
- బసవతారకం హాస్పిటల్: ఏపీ వాసులకు శుభవార్త..
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్గా బి.సుమతి బాధ్యతల స్వీకరణ
- కార్పొరేట్ ట్యాక్స్ బిల్లులో లోపాలను ఎత్తిచూపిన పార్లమెంట్ ప్యానెల్..!!
- 3 గంటల రెస్క్యూ..మహిళను రక్షించిన యూఏఈ హైకర్..!!
- 2026 Q1లో సౌదీ GDP 2.8% వృద్ధి..!!
- ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై QCAA కఠిన చర్యలు..!!
- ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిక..ఒమన్ 7 స్థానాలు మెరుగు..!!
- కువైట్ లో జూన్ 30 వరకు కార్మికుల బదిలీలు..!!
- ఈ ఆదివారం నుంచి జజీరా ఎయిర్వేస్ పూర్తిస్థాయి సేవలు పునఃప్రారంభం









