క్యాబిన్ క్రూ సంక్షోభం.. తగ్గనున్న ఎయిర్ ఇండియా సర్వీసులు..!
- May 09, 2024
యూఏఈ: క్యాబిన్ సిబ్బంది సంక్షోభం కారణంగా 90 కంటే ఎక్కువ అంతర్జాతీయ మరియు దేశీయ విమానాలు ఆలస్యం కావడం, రద్దు చేయడం జరిగింది.ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO), అలోకే సింగ్ స్పందిస్తూ.. రాబోయే రోజుల్లో విమానయాన కార్యకలాపాలను తగ్గించనున్నట్లు బుధవారం ప్రకటించారు.
"నిన్న సాయంత్రం నుండి, మా క్యాబిన్ సిబ్బందిలో 100 మంది సహోద్యోగులు తమ రోస్టర్డ్ ఫ్లైట్ డ్యూటీకి ముందు అనారోగ్యంతో ఉన్నారని, చివరి నిమిషంలో తమ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగించారని నివేదించారు. ఈ చర్య ఎక్కువగా L1 పాత్రను కేటాయించిన సహోద్యోగులు చేసినందున, ప్రభావం అధికంగా ఉందన్నారు.
మరోవైపుఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాల రద్దు లేదా ఆలస్యం కారణంగా యూఏఈ నుండి వందలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విమానాల రద్దు వార్త వ్యాప్తి చెందడంతో, ఇతర విమానయాన సంస్థల టిక్కెట్ ధరలు భారీగా పెంచాయి. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాల రద్దుపై భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ స్పందించింది. దీనికి సంబంధించి వివరణ కోరింది. సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంస్థకు సలహా ఇచ్చింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ప్రమాణం ప్రకారం ప్రయాణీకులకు సౌకర్యాలు కల్పించాలని ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్కు సూచించింది.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..









