క్యాబిన్ క్రూ సంక్షోభం.. తగ్గనున్న ఎయిర్ ఇండియా సర్వీసులు..!
- May 09, 2024
యూఏఈ: క్యాబిన్ సిబ్బంది సంక్షోభం కారణంగా 90 కంటే ఎక్కువ అంతర్జాతీయ మరియు దేశీయ విమానాలు ఆలస్యం కావడం, రద్దు చేయడం జరిగింది.ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO), అలోకే సింగ్ స్పందిస్తూ.. రాబోయే రోజుల్లో విమానయాన కార్యకలాపాలను తగ్గించనున్నట్లు బుధవారం ప్రకటించారు.
"నిన్న సాయంత్రం నుండి, మా క్యాబిన్ సిబ్బందిలో 100 మంది సహోద్యోగులు తమ రోస్టర్డ్ ఫ్లైట్ డ్యూటీకి ముందు అనారోగ్యంతో ఉన్నారని, చివరి నిమిషంలో తమ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగించారని నివేదించారు. ఈ చర్య ఎక్కువగా L1 పాత్రను కేటాయించిన సహోద్యోగులు చేసినందున, ప్రభావం అధికంగా ఉందన్నారు.
మరోవైపుఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాల రద్దు లేదా ఆలస్యం కారణంగా యూఏఈ నుండి వందలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విమానాల రద్దు వార్త వ్యాప్తి చెందడంతో, ఇతర విమానయాన సంస్థల టిక్కెట్ ధరలు భారీగా పెంచాయి. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాల రద్దుపై భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ స్పందించింది. దీనికి సంబంధించి వివరణ కోరింది. సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంస్థకు సలహా ఇచ్చింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ప్రమాణం ప్రకారం ప్రయాణీకులకు సౌకర్యాలు కల్పించాలని ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్కు సూచించింది.
తాజా వార్తలు
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత







