సౌదీలో 3-సెమిస్టర్ విధానంపై అధ్యయనం పూర్తి..!
- May 10, 2024
రియాద్: మూడు సెమిస్టర్ల విధానంపై సౌదీ విద్యా మంత్రిత్వ శాఖ చేపట్టిన అధ్యయనం పూర్తయిన తర్వాత ఫలితాలను ప్రకటిస్తామని సౌదీ విద్యా మంత్రి యూసఫ్ అల్-బెన్యాన్ తెలిపారు. బుధవారం రియాద్లో స్పీకర్ షేక్ అబ్దుల్లా అల్-షేక్ అధ్యక్షతన జరిగిన శౌరా కౌన్సిల్ సెషన్లో ఎడ్యుకేషన్ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ కమిటీ హెడ్ డాక్టర్ ఐషా జక్రి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. "విద్యా మంత్రిత్వ శాఖ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు సంబంధిత అధికారుల భాగస్వామ్యంతో శాస్త్రీయ మరియు విద్యా పునాదుల ప్రకారం మూడు-సెమిస్టర్ అనుభవాన్ని తెలుసుకోవడానికి కృషి చేస్తోంది. ఈ అధ్యయనం పూర్తయిన తర్వాత మంత్రిత్వ శాఖ ఈ అధ్యయనం ఫలితాన్ని ప్రకటిస్తుంది" అని ఆయన చెప్పారు. మూడు సెమిస్టర్లతో కూడిన సానుకూల ప్రభావం, సవాళ్ల గురించి అధ్యయనం చేయడానికి ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్నట్లు శౌరా కౌన్సిల్లో చెప్పారు. మంత్రిత్వ శాఖ గత విద్యా సంవత్సరంలో ప్రభుత్వ విద్యా స్థాయిలో మూడు సెమిస్టర్ల విధానాన్ని ప్రవేశపెట్టింది. మంత్రిత్వ శాఖ విద్యా సంవత్సరాన్ని మునుపటి రెండు సెమిస్టర్లకు బదులుగా మూడు సెమిస్టర్లుగా విభజించింది, ప్రతి సెమిస్టర్కు 13 వారాల సమయాన్ని కేటాయించింది.
తాజా వార్తలు
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్
- ఫుజైరః ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి చార్టర్ విమాన సర్వీసులు
- అత్యవసర సమయాల్లో పేరెంట్స్ బీ అలెర్ట్: ఖతార్
- మిడిల్ ఈస్ట్ కు పరిమితంగా ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్స్..!!
- కువైట్లో డ్రోన్ శకలాలు తగిలి 11 ఏళ్ల బాలిక మృతి..!!
- ఒమన్లో డ్రోన్లు, ఏరియల్ వస్తువుల పై అలెర్ట్ జారీ..!!









