సౌదీలో 3-సెమిస్టర్ విధానంపై అధ్యయనం పూర్తి..!
- May 10, 2024
రియాద్: మూడు సెమిస్టర్ల విధానంపై సౌదీ విద్యా మంత్రిత్వ శాఖ చేపట్టిన అధ్యయనం పూర్తయిన తర్వాత ఫలితాలను ప్రకటిస్తామని సౌదీ విద్యా మంత్రి యూసఫ్ అల్-బెన్యాన్ తెలిపారు. బుధవారం రియాద్లో స్పీకర్ షేక్ అబ్దుల్లా అల్-షేక్ అధ్యక్షతన జరిగిన శౌరా కౌన్సిల్ సెషన్లో ఎడ్యుకేషన్ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ కమిటీ హెడ్ డాక్టర్ ఐషా జక్రి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. "విద్యా మంత్రిత్వ శాఖ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు సంబంధిత అధికారుల భాగస్వామ్యంతో శాస్త్రీయ మరియు విద్యా పునాదుల ప్రకారం మూడు-సెమిస్టర్ అనుభవాన్ని తెలుసుకోవడానికి కృషి చేస్తోంది. ఈ అధ్యయనం పూర్తయిన తర్వాత మంత్రిత్వ శాఖ ఈ అధ్యయనం ఫలితాన్ని ప్రకటిస్తుంది" అని ఆయన చెప్పారు. మూడు సెమిస్టర్లతో కూడిన సానుకూల ప్రభావం, సవాళ్ల గురించి అధ్యయనం చేయడానికి ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్నట్లు శౌరా కౌన్సిల్లో చెప్పారు. మంత్రిత్వ శాఖ గత విద్యా సంవత్సరంలో ప్రభుత్వ విద్యా స్థాయిలో మూడు సెమిస్టర్ల విధానాన్ని ప్రవేశపెట్టింది. మంత్రిత్వ శాఖ విద్యా సంవత్సరాన్ని మునుపటి రెండు సెమిస్టర్లకు బదులుగా మూడు సెమిస్టర్లుగా విభజించింది, ప్రతి సెమిస్టర్కు 13 వారాల సమయాన్ని కేటాయించింది.
తాజా వార్తలు
- ఫాల్స్ రియల్ ఎస్టేట్ సమాచారం ఇస్తే SR50,000 వరకు ఫైన్..!!
- ‘అఫాక్’ పేమెంట్ సిస్టమ్ లో చేరిన ఖతార్ సెంట్రల్ బ్యాంక్..!!
- కువైట్ లో కేపిటల్ లో భద్రత మరింత పటిష్టం.. 257 అరెస్ట్..!!
- మెడికల్ సెంటర్ కు షాక్.. డాక్టర్కు BD4,072 చెల్లించాలని కోర్టు తీర్పు..!!
- ఒమన్ కుటుంబాల నెలవారీ ఆదాయం పెరుగుదల..!!
- దుబాయ్ లో 9 రోజుల స్కూల్ బ్రేక్.. అక్టోబర్ హాఫ్-టర్మ్ తేదీల్లో మార్పులు..!!
- వైరల్ గా మారిన H1N1 ఫ్లూ ! లైట్ తీసుకుంటే మీకే ప్రమాదం
- బహ్రెయిన్-భారత్ సంబంధాల బలోపేతంపై ప్రశంసలు..!!
- త్వరలో యూనిఫైడ్ గల్ఫ్ టూరిస్ట్ వీసా..!!
- దుబాయ్లో టండూర్ టీనా రెస్టారెంట్ శాశ్వతంగా మూసివేత..!!







