కుమార్తెలను శారీరకంగా హింసించిన తండ్రి అరెస్ట్
- May 10, 2024
మనామా: మారు తండ్రి తన ఇద్దరు చిన్న కుమార్తెలను శారీరకంగా హింసించాడన్న ఫిర్యాదుపై పబ్లిక్ ప్రాసిక్యూషన్ వేగంగా స్పందించింది. సదరు తండ్రిపై తక్షణ చర్య తీసుకుంది. ఫ్యామిలీ అండ్ చైల్డ్ ప్రాసిక్యూషన్ ఆఫీస్ డిప్యూటీ హెడ్ ప్రకారం.. ప్రభుత్వ పాఠశాలలో జరిగిన సంఘటనకు సంబంధించి పబ్లిక్ ప్రాసిక్యూషన్ విద్యా మంత్రిత్వ శాఖ మరియు దక్షిణ హమద్ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి ఫిర్యాదును స్వీకరించింది. ఒక ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు బాలికల ఒక చేతిపై గాయాలను గమనించాడు. ఉపాధ్యాయుడు వారిని ప్రశ్నించగా.. తోబుట్టువులిద్దరూ ఇంట్లో తమ మారు తండ్రి చేతిలో తీవ్రంగా కొట్టబడ్డారని తెలిపారు. వెంటనే పబ్లిక్ ప్రాసిక్యూషన్ నివేదిక అందిన తర్వాత కేసుపై దర్యాప్తు ప్రారంభించింది. శారీరక వేధింపుల ఆరోపణలకు సంబంధించి నిందితుడైన చిన్నారుల తండ్రిని వెంటనే అదుపులోకి తీసుకొని విచారించారు. కేసును విచారణ కోసం క్రిమినల్ కోర్టుకు రిఫర్ చేయడానికి అవసరమైన చట్టపరమైన ప్రక్రియలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఫాల్స్ రియల్ ఎస్టేట్ సమాచారం ఇస్తే SR50,000 వరకు ఫైన్..!!
- ‘అఫాక్’ పేమెంట్ సిస్టమ్ లో చేరిన ఖతార్ సెంట్రల్ బ్యాంక్..!!
- కువైట్ లో కేపిటల్ లో భద్రత మరింత పటిష్టం.. 257 అరెస్ట్..!!
- మెడికల్ సెంటర్ కు షాక్.. డాక్టర్కు BD4,072 చెల్లించాలని కోర్టు తీర్పు..!!
- ఒమన్ కుటుంబాల నెలవారీ ఆదాయం పెరుగుదల..!!
- దుబాయ్ లో 9 రోజుల స్కూల్ బ్రేక్.. అక్టోబర్ హాఫ్-టర్మ్ తేదీల్లో మార్పులు..!!
- వైరల్ గా మారిన H1N1 ఫ్లూ ! లైట్ తీసుకుంటే మీకే ప్రమాదం
- బహ్రెయిన్-భారత్ సంబంధాల బలోపేతంపై ప్రశంసలు..!!
- త్వరలో యూనిఫైడ్ గల్ఫ్ టూరిస్ట్ వీసా..!!
- దుబాయ్లో టండూర్ టీనా రెస్టారెంట్ శాశ్వతంగా మూసివేత..!!







