కుమార్తెలను శారీరకంగా హింసించిన తండ్రి అరెస్ట్
- May 10, 2024
మనామా: మారు తండ్రి తన ఇద్దరు చిన్న కుమార్తెలను శారీరకంగా హింసించాడన్న ఫిర్యాదుపై పబ్లిక్ ప్రాసిక్యూషన్ వేగంగా స్పందించింది. సదరు తండ్రిపై తక్షణ చర్య తీసుకుంది. ఫ్యామిలీ అండ్ చైల్డ్ ప్రాసిక్యూషన్ ఆఫీస్ డిప్యూటీ హెడ్ ప్రకారం.. ప్రభుత్వ పాఠశాలలో జరిగిన సంఘటనకు సంబంధించి పబ్లిక్ ప్రాసిక్యూషన్ విద్యా మంత్రిత్వ శాఖ మరియు దక్షిణ హమద్ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి ఫిర్యాదును స్వీకరించింది. ఒక ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు బాలికల ఒక చేతిపై గాయాలను గమనించాడు. ఉపాధ్యాయుడు వారిని ప్రశ్నించగా.. తోబుట్టువులిద్దరూ ఇంట్లో తమ మారు తండ్రి చేతిలో తీవ్రంగా కొట్టబడ్డారని తెలిపారు. వెంటనే పబ్లిక్ ప్రాసిక్యూషన్ నివేదిక అందిన తర్వాత కేసుపై దర్యాప్తు ప్రారంభించింది. శారీరక వేధింపుల ఆరోపణలకు సంబంధించి నిందితుడైన చిన్నారుల తండ్రిని వెంటనే అదుపులోకి తీసుకొని విచారించారు. కేసును విచారణ కోసం క్రిమినల్ కోర్టుకు రిఫర్ చేయడానికి అవసరమైన చట్టపరమైన ప్రక్రియలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్
- ఫుజైరః ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి చార్టర్ విమాన సర్వీసులు
- అత్యవసర సమయాల్లో పేరెంట్స్ బీ అలెర్ట్: ఖతార్
- మిడిల్ ఈస్ట్ కు పరిమితంగా ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్స్..!!
- కువైట్లో డ్రోన్ శకలాలు తగిలి 11 ఏళ్ల బాలిక మృతి..!!
- ఒమన్లో డ్రోన్లు, ఏరియల్ వస్తువుల పై అలెర్ట్ జారీ..!!
- యూఏఈలో మెడిసిన్ స్టాక్ పై ఆందోళన వద్దు..!!









