విలన్గా దర్శకుడు ఎస్.జె. సూర్య..
- June 08, 2016
మహేశ్బాబు హీరోగా ఎ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో విలన్గా దర్శకుడు ఎస్.జె. సూర్య నటిస్తారనే వార్త ఇప్పటికే ప్రచారంలో ఉంది. మరోవైపు రజనీకాంత్ '2.0'లో విలన్గా నటిస్తున్న హిందీ నటుడు అక్షయ్కుమార్ పేరు కూడా వినిపించింది. ఫైనల్లీ యస్.జె. సూర్య ఖరారయ్యారు. ఈ విషయాన్ని చిత్రదర్శకుడు మురుగదాస్ స్వయంగా ప్రకటించారు.దర్శకుడిగా తమిళంలో 'వాలి', తెలుగులో 'ఖుషి' చిత్రాలు సూర్యకు మంచి పేరు తెచ్చాయి. ఇంకా ఆయన పలు చిత్రాలకు దర్శకత్వం వహించడంతో పాటు హీరోగానూ నటించారు. ఇప్పుడు మహేశ్బాబు సినిమాలో విలన్గా కనిపించనున్నారు.వచ్చే నెల 15న ఈ చిత్రం షూటింగ్ ఆరంభమయ్యే అవకాశం ఉంది. ఒకవైపు ఈ చిత్రంలో నటిస్తూనే మరోవైపు పవన్ కల్యాణ్ హీరోగా తాను దర్శకత్వం వహించనున్న చిత్రంతో ఎస్.జె. సూర్య బిజీ కానున్నారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







