విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- May 18, 2024
దుబాయ్: దుబాయ్లోని ప్రైవేట్ పాఠశాలల్లో అసాధారణమైన ఎమిరాటీ విద్యార్థుల కోసం 400 కంటే ఎక్కువ స్కాలర్షిప్లను ప్రకటించారు. నాలెడ్జ్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ అథారిటీ (KHDA) దుబాయ్ సోషల్ ఎజెండా 33లో భాగంగా ఈ ఆఫర్ ని వెల్లడించింది. దుబాయ్ డిస్టింగ్విష్డ్ స్టూడెంట్స్ ప్రోగ్రామ్ అని పేరు పెట్టబడిన ఈ స్కాలర్షిప్లు ఇటీవలి తనిఖీలలో 'గుడ్ లేదా బెటర్' అని రేట్ చేయబడిన పాఠశాలల్లో అత్యుత్తమ ఎమిరాటీ విద్యార్థుల వార్షిక ట్యూషన్ ఫీజులో సగం కవర్ చేస్తాయని తెలిపింది. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన దరఖాస్తులు మే 20 నుండి జూన్ 5 వరకు అందుబాటులో ఉంటాయి. ఎమిరాటీ తల్లిదండ్రులు తమ పిల్లలను KHDA వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమం 2030 నాటికి మొత్తం 1800 స్కాలర్షిప్లను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు, ఇప్పటి వరకు తొమ్మిది పాఠశాలలు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కలిగి ఉన్నాయని KHDA డైరెక్టర్ జనరల్ అయిన ఐషా అబ్దుల్లా మిరాన్ వెల్లడించారు.
తాజా వార్తలు
- రాచకొండ పోలీసులను అభినందించిన డిజిపి బి.శివధర్ రెడ్డి
- ఏపీ: లోక్ అదాలత్ 2 లక్షల కేసుల పరిష్కారం
- పెమ్మసానికి కీలక బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబు
- లియోనెల్ మెస్సీ జట్టు పై సీఎం రేవంత్ రెడ్డి టీమ్ ఘనవిజయం..
- కాంగ్రెస్ ‘ఓట్ చోరీ’ నిరసన పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ
- నమ్మకం, అభివృద్ధి ద్వారానే శాశ్వత శాంతి..!!
- దుబాయ్లో తగ్గిన నేరాల రేటు..ఎకానమీ హైక్..!!
- గ్లోబల్ పాస్పోర్ట్ పవర్ ర్యాంక్ 2025: యూఏఈ టాప్..ఖతార్ స్ట్రాంగ్..!!
- కువైట్ లో అత్యధికంగా 24.3 మి.మీ వర్షపాతం..!!
- ధురంధర్ కు గల్ఫ్ దేశాలలో అనుమతి నిరాకరణ..!!







