విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- May 18, 2024
దుబాయ్: దుబాయ్లోని ప్రైవేట్ పాఠశాలల్లో అసాధారణమైన ఎమిరాటీ విద్యార్థుల కోసం 400 కంటే ఎక్కువ స్కాలర్షిప్లను ప్రకటించారు. నాలెడ్జ్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ అథారిటీ (KHDA) దుబాయ్ సోషల్ ఎజెండా 33లో భాగంగా ఈ ఆఫర్ ని వెల్లడించింది. దుబాయ్ డిస్టింగ్విష్డ్ స్టూడెంట్స్ ప్రోగ్రామ్ అని పేరు పెట్టబడిన ఈ స్కాలర్షిప్లు ఇటీవలి తనిఖీలలో 'గుడ్ లేదా బెటర్' అని రేట్ చేయబడిన పాఠశాలల్లో అత్యుత్తమ ఎమిరాటీ విద్యార్థుల వార్షిక ట్యూషన్ ఫీజులో సగం కవర్ చేస్తాయని తెలిపింది. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన దరఖాస్తులు మే 20 నుండి జూన్ 5 వరకు అందుబాటులో ఉంటాయి. ఎమిరాటీ తల్లిదండ్రులు తమ పిల్లలను KHDA వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమం 2030 నాటికి మొత్తం 1800 స్కాలర్షిప్లను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు, ఇప్పటి వరకు తొమ్మిది పాఠశాలలు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కలిగి ఉన్నాయని KHDA డైరెక్టర్ జనరల్ అయిన ఐషా అబ్దుల్లా మిరాన్ వెల్లడించారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







