హాస్పటల్ లో చేరిన షారుఖ్
- May 23, 2024అహ్మదాబాద్: కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ హాస్పటల్ లో చేరిన విషయం అభిమానులను ఆందోళనకు గురి చేస్తుంది. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో 2024 ఐపీఎల్ ప్లేఆఫ్స్ మ్యాచ్లు జరుగుతున్నాయి. షారుక్ సొంత ఫ్రాంచైజీ కోల్కతా నైట్రైడర్స్ ప్లేఆఫ్స్లో భాగంగా మంగళవారం సన్రైజర్స్తో తలపడింది. ఈ మ్యాచ్లో తన జట్టును ప్రోత్సహించేందుకు షారుక్ ఫ్యామిలీతో సహా అహ్మదాబాద్ వెళ్లారు. రెండు రోజులుగా వాతావరణంలో ఉష్ణోగ్రత కారణంగా ఆయన డిహైడ్రేషన్తో అస్వస్థతకు గురైనట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. దీంతో స్థానిక కేడీ హాస్పిటల్లో చేరిన బాద్షా చికిత్స అనంతరం డిశ్ఛార్జి అయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ‘షారుక్ ఖాన్ హీట్ స్ట్రోక్ కారణంగా ఆయన అస్వస్థకు గురయ్యారు. కేడీ హాస్పిటల్లో జాయిన్ అయ్యి, ట్రీట్మెంట్ తీసుకొని డిశ్చార్డి అయ్యారు’ అని అహ్మదాబాద్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఓం ప్రకాశ్ జత్ పేర్కొన్నారు.
కాగా, షారుక్ గతేడాది హ్యాట్రిక్ హిట్లను అందుకున్నారు. పఠాన్, జవాన్తో చెరో రూ.1000 కోట్ల సాధించిన ఆయన డంకీ మరో రూ.500కోట్ల వరకు వసూలు చేశారు. ఆ తర్వాత ఇప్పటి వరకు ఆయన మరో సినిమాను అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. కానీ కింగ్ అనే సినిమా చేస్తున్నారని గత కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. ఈ చిత్రంతోనే షారుక్ కూతురు సుహానా ఖాన్ కూడా వెండితెర అరంగేట్రం చేయనుందని తెలిసింది. తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరూధ్ మ్యూజిక్ అందిస్తున్నారట. సుజయ్ ఘోష్ దర్శకత్వం వహిస్తున్నారు. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్పై సిద్ధార్థ్ ఆనంద్తో కలిసి షారుక్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
- మంత్రిగా నారాయణ బాధ్యతలు స్వీకరణ..
- యూఏఈలో జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం
- ఈ ఏడాది హజ్ చేసిన 1.83 మిలియన్ల మంది యాత్రికులు
- G7 సమ్మిట్.. UK ప్రధానిని కలిసిన యూఏఈ అధ్యక్షుడు
- మంగాఫ్ అగ్నిప్రమాదం..బాధిత కుటుంబాలకు 4 ఏళ్ల వరకు జీతం
- ఒమన్ లో ఎలక్ట్రిక్ స్కూటర్లతో స్మార్ట్ మొబిలిటీ సర్వీస్ ట్రయల్ ప్రారంభం
- ప్రైవేట్ రంగ ఉద్యోగులకు ఈద్ అల్ అదా సెలవులు ఇవే
- ఈద్ అల్ అదా..1,138 మంది ఖైదీల విడుదల
- మంత్రులతో కలిసి కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సందర్శించిన సీఎం రేవంత్
- విజయవాడ-ముంబై విమాన సర్వీసు ప్రారంభించిన ఎంపీ బాలశౌరి