తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన..
- May 23, 2024
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడడంతో తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. గంటకు 40 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
అల్పపీడనం శుక్రవారం వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్నట్లు చెప్పారు. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెంతో పాటు ఖమ్మం, మహబూబాబాద్, సిద్దిపేట, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు.
కాగా, నైరుతి రుతుపవనాలు బంగాళాఖాతంలో చురుగ్గా కదులుతున్నాయి. అవి దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవుల్లో మరి కొన్ని ప్రాంతాల్లోకి విస్తరించనున్నాయి. వచ్చే నెల 8 నుంచి 11 మధ్య రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయి.
ఎండాకాలం ముగియకముందే జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల ప్రజలు ఎండల నుంచి ఉపశమనం పొందుతుంటే, మరికొన్ని ప్రాంతాల వారు వానల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నైరుతి రుతుపవనాలు కూడా ఈ సారి త్వరగా వస్తున్నాయి.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







