తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన..
- May 23, 2024పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడడంతో తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. గంటకు 40 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
అల్పపీడనం శుక్రవారం వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్నట్లు చెప్పారు. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెంతో పాటు ఖమ్మం, మహబూబాబాద్, సిద్దిపేట, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు.
కాగా, నైరుతి రుతుపవనాలు బంగాళాఖాతంలో చురుగ్గా కదులుతున్నాయి. అవి దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవుల్లో మరి కొన్ని ప్రాంతాల్లోకి విస్తరించనున్నాయి. వచ్చే నెల 8 నుంచి 11 మధ్య రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయి.
ఎండాకాలం ముగియకముందే జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల ప్రజలు ఎండల నుంచి ఉపశమనం పొందుతుంటే, మరికొన్ని ప్రాంతాల వారు వానల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నైరుతి రుతుపవనాలు కూడా ఈ సారి త్వరగా వస్తున్నాయి.
తాజా వార్తలు
- మంగాఫ్ అగ్నిప్రమాదం..బాధిత కుటుంబాలకు 4 ఏళ్ల వరకు జీతం
- ఒమన్ లో ఎలక్ట్రిక్ స్కూటర్లతో స్మార్ట్ మొబిలిటీ సర్వీస్ ట్రయల్ ప్రారంభం
- ప్రైవేట్ రంగ ఉద్యోగులకు ఈద్ అల్ అదా సెలవులు ఇవే
- ఈద్ అల్ అదా..1,138 మంది ఖైదీల విడుదల
- మంత్రులతో కలిసి కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సందర్శించిన సీఎం రేవంత్
- విజయవాడ-ముంబై విమాన సర్వీసు ప్రారంభించిన ఎంపీ బాలశౌరి
- ITR ఫైలింగ్.. ఆన్లైన్లో ఆదాయపు పన్ను రిటర్న్ను ఎలా ఫైల్ చేయాలి?
- డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
- మధ్యతరహా పరిశ్రమల పై కేంద్ర మంత్రి కుమారస్వామి కీలక వ్యాఖ్యలు..
- $1.5 మిలియన్ యూఎస్ జరిమానా.. ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ క్లారిటీ