తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన..
- May 23, 2024
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడడంతో తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. గంటకు 40 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
అల్పపీడనం శుక్రవారం వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్నట్లు చెప్పారు. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెంతో పాటు ఖమ్మం, మహబూబాబాద్, సిద్దిపేట, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు.
కాగా, నైరుతి రుతుపవనాలు బంగాళాఖాతంలో చురుగ్గా కదులుతున్నాయి. అవి దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవుల్లో మరి కొన్ని ప్రాంతాల్లోకి విస్తరించనున్నాయి. వచ్చే నెల 8 నుంచి 11 మధ్య రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయి.
ఎండాకాలం ముగియకముందే జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల ప్రజలు ఎండల నుంచి ఉపశమనం పొందుతుంటే, మరికొన్ని ప్రాంతాల వారు వానల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నైరుతి రుతుపవనాలు కూడా ఈ సారి త్వరగా వస్తున్నాయి.
తాజా వార్తలు
- అమెరికాలో తెలుగమ్మాయికి ప్రతిష్టాత్మక పురస్కారం
- తెలంగాణలో నిప్పుల కొలిమి: పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ!
- ఒమన్ తీవ్రమైన వేడి.. 48°Cకు ఉష్ణోగ్రతలు..!!
- క్యజో రి శిఖరాన్ని అధిరోహించిన యువ బహ్రెయిన్ సాహసికుడు..!!
- అల్ జౌర్ బీచ్లో షార్క్ దాడిలో 11 ఏళ్ల బాలికకు గాయాలు..!!
- అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన..ప్రత్యేకంగా సౌదీ పెవిలియన్..!!
- Q1లో స్థిరంగా ఖతార్ రిటైల్ రియల్ ఎస్టేట్ మార్కెట్..!!
- దుబాయ్లో జూన్ 1నుంచి సాలిక్ వ్యాట్ నిబంధన..!!
- తిరుమలకు రూ.1.13 కోట్ల ఎలక్ట్రిక్ బస్సు విరాళం
- విద్యార్థుల సురక్షిత రవాణాకు సరికొత్త ప్రణాళిక: సైబరాబాద్ సీపీ రమేష్









